Begin typing your search above and press return to search.
విద్యార్థులకు కేంద్ర సాయమా!.. అదంతా ఉత్తదే!
By: Tupaki Desk | 23 Sept 2020 2:40 PM ISTకరోనా లాక్ న్తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పేదప్రజలను ఆదుకుంటుందని, కొన్నివర్గాలవారికి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నదని ఈ మధ్య కొన్నివెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు వైరల్గా మారాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు రూ.11 వేలు ఆర్థిక సాయం చేస్తున్నదని.. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాలని ఆ వార్త సారాంశం. ఈ వార్త కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షలమంది విద్యార్థులకు చేరి పోయింది.
అయితే ఈ వార్త పై కేంద్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పందించింది. సమాచారశాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ఆర్థికసాయం అందించడం లేదని.. ఓ సైట్ లో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నది. సదరు వార్తను ప్రస్తుతం ఫేస్ బుక్ నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు తప్పుడు వార్తలు నమ్మొద్దని.. వాటిని వైరల్ చేయొద్దని కేంద్ర సమాచారశాఖ సూచించింది. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే తెలియజేస్తామని అటువంటి వరకు తప్పుడు వార్తలు నమ్మొద్దని పేర్కొన్నది. తప్పుడు వార్తలను అరికట్టేందుకు 2019 డిసెంబర్ లో ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్ ను ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు నిజమో కాదా అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మధ్య సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు ప్రచారం కావడం కామన్ గా మారిపోయింది. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇటువంటి ఫేక్ న్యూస్ ను ఫేస్ బుక్ లో ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ వార్త పై కేంద్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పందించింది. సమాచారశాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ఆర్థికసాయం అందించడం లేదని.. ఓ సైట్ లో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నది. సదరు వార్తను ప్రస్తుతం ఫేస్ బుక్ నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు తప్పుడు వార్తలు నమ్మొద్దని.. వాటిని వైరల్ చేయొద్దని కేంద్ర సమాచారశాఖ సూచించింది. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే తెలియజేస్తామని అటువంటి వరకు తప్పుడు వార్తలు నమ్మొద్దని పేర్కొన్నది. తప్పుడు వార్తలను అరికట్టేందుకు 2019 డిసెంబర్ లో ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్ ను ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు నిజమో కాదా అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మధ్య సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు ప్రచారం కావడం కామన్ గా మారిపోయింది. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇటువంటి ఫేక్ న్యూస్ ను ఫేస్ బుక్ లో ప్రచారం చేస్తున్నారు.
