Begin typing your search above and press return to search.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సీబీఐ షాక్
By: Tupaki Desk | 20 Nov 2020 2:40 PM ISTటీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సీబీఐ గట్టి షాకిచ్చింది. ఆయన అక్రమ మైనింగ్ పై కొరఢా ఝలిపించింది. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, మరికొందరు నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
గురజాల సమీపంలో జరిగిన అక్రమ మైనింగ్ పై దర్యాప్తునకు గుంటూరు, హైదరాబాద్ లోని 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. సోదాల సమయంలో కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అక్రమ మైనింగ్ ఎంతమేరకు జరిగిందో నిర్ధారించేందుకు శాటిలైట్ ద్వారా వాల్యుమెట్రిక్ విశ్లేషణ జరుపుతోంది.
టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17మంది అక్రమ మైనింగ్ చేశారని.. 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని గ్రామాల పరిధిలో అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాల్లో విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారనే అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
కాంగ్రెస్ హయాంలోనే యరపతినేనిపై ఓ కేసు నమోదైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
గురజాల సమీపంలో జరిగిన అక్రమ మైనింగ్ పై దర్యాప్తునకు గుంటూరు, హైదరాబాద్ లోని 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. సోదాల సమయంలో కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అక్రమ మైనింగ్ ఎంతమేరకు జరిగిందో నిర్ధారించేందుకు శాటిలైట్ ద్వారా వాల్యుమెట్రిక్ విశ్లేషణ జరుపుతోంది.
టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17మంది అక్రమ మైనింగ్ చేశారని.. 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని గ్రామాల పరిధిలో అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాల్లో విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారనే అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
కాంగ్రెస్ హయాంలోనే యరపతినేనిపై ఓ కేసు నమోదైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
