Begin typing your search above and press return to search.

చెన్నై ఓటర్లు ఓటు వేశాక ఏం చేశారంటే..?

By:  Tupaki Desk   |   17 May 2016 4:32 AM GMT
చెన్నై ఓటర్లు ఓటు వేశాక ఏం చేశారంటే..?
X
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిన్నటి పోలింగ్ తో పూర్తి అయిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. సోమవారం మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా చెన్నై ఓటర్లు తాము ఓటు వేశాక ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. కాకుంటే.. అలాంటి బంపర్ ఆఫర్ చెన్నై ఓటర్లకు మాత్రమే సాధ్యమైంది మరి.

ఏజిఎస్ సినిమాస్ మల్టీఫ్లెక్స్ చెన్నై ఓటర్లకు భారీ బొనంజా ప్రకటించింది. ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఎవరైతే తమ ఇంక్ ఫింగర్ సెల్ఫీని పోస్ట్ చేస్తారో వారందరికి ఫ్రీగా తమ మల్టీఫ్లెక్స్ లో సినిమా టికెట్ ఇస్తామని ప్రకటించింది. ఓటు వేయటాన్ని ప్రోత్సహించే పనిలో భాగంగా ఏజీఎస్ చేపట్టిన ఈ ప్రచారం సక్సెస్ కావటమే కాదు.. ఓటేసిన పలువురు చెన్నై ఓటర్లు తమ సెల్ఫీల్ని తీసి సినిమా టికెట్ ఉచితంగా పొందారు.

దీంతో.. ఓటేసిన చెన్నై ఓటర్లు ఎంచక్కా ఏజీఎస్ మల్టీఫ్లెక్స్ కి వెళ్లి సినిమా చూసొచ్చారు. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలిసిన వారు.. తాము ఉన్న చోట కూడా ఇదే తరహా ఆఫర్ ఉండి ఉంటే ఎంత బాగుండని ఫీలయ్యారు. ఏమైనాచెన్నై ఓటర్లకు విచిత్రమైన ఆఫర్ లభించిందనే చెప్పాలి.