Begin typing your search above and press return to search.
రోహిత్ ఎందుకు రాలేదో ఇప్పటికీ తెలియదు.. కోహ్లీ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Nov 2020 11:00 AM ISTరోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక కాకపోవడం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్మీడియా వేదికగా అనేకసార్లు స్పందించారు. ఏకంగా బీసీసీఐ చైర్మన్ గంగూలీయే రోహిత్ శర్మను ఎందుకు ఎంపికచెయ్యలేదో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే హిట్మ్యాన్ రోహిత్శర్మకు.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు ఉన్నాయని అందుకే రోహిత్ను ఎంపికచేయలేదంటూ సోషల్మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. రోహిత్కు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఎంపిక చేయలేదని.. ఇందులో రాజకీయం ఏమిలేదని బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలిచాక రోహిత్ను టీం ఇండియాకు కెప్టెన్గా ప్రకటించాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ఏకంగా గౌతమ్ గంభీర్ లాంటి సీనియర్ ఆటగాళ్లే ఇటువంటి చర్చకు తెరలేపారు. గంభీర్కు మద్దతుగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. రోహిత్ను టీ20 ఫార్మాట్ అయిన కెప్టెన్గా ఎంపిక చేయాలని గంభీర్ వాదించాడు. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కూడా సున్నితంగా తిరస్కరించింది. ఒక కంపెనీకి ఒక్కడే సీఈవో ఉన్నట్టే ఒక్క జట్టుకు ఒక్కడే కెప్టెన్ ఉండాలని కపిల్దేవ్ లాంటి సీనియర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2020లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ గాయపడ్డాడు. దీంతో బీసీసీఐ రోహిత్ను టీం ఇండియా జట్టుకు ఎంపికచేయలేదు. కానీ ఆ తర్వాత రోహిత్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. తాను ఫిట్గానే ఉన్నానని సంకేతం పంపించాడు.
చివరకు బీసీసీఐ రెండు టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ను ఎంపికచేసింది. బీసీసీఐ చైర్మన్ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘రోహిత్ లాంటి ఆటగాడిని మేం ఎందుకు వదులుకుంటాం. కానీ అతడు ప్రస్తుతం ఫిట్గా లేడు అందుకే ఎంపికచేయలేదు. ఇప్పుడు అతడిని ఎంపిక చేస్తే.. ఒకవేళ గాయం ఎక్కువైతే భవిష్యత్లో ఇబ్బంది అవుతుంది. రోహిత్కు ఎంతో భవిష్యత్ ఉంది’ అంటూ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే రోహిత్ మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేదు.
ఈ విషయంపై తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘రోహిత్ ఈ టెస్ట్ సీరిస్కు ఎందుకు రాలేదో తెలియదు. అతడి గాయంపై కూడా సమాచారం లేదు. అతడి రాకపై ప్రస్తుతం పూర్తి గందరగోళం నెలకొన్నది. రోహిత్ ఆస్ట్రేలియా టూర్కు వస్తాడని మేమంతా భావించాం. అతడు విమానం ఎక్కుతాడని ఎదురుచూశాం. కానీ రోహిత్ మాత్రం రాలేదు. మేం ఎదురుచూపుల ఆట ఆడాం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కాగా గాయం కారణంగానే తాను రాలేకపోతున్నానని, రావడం లేదని రోహిత్ మెయిల్ పంపినట్టు సమాచారం.
ఏకంగా గౌతమ్ గంభీర్ లాంటి సీనియర్ ఆటగాళ్లే ఇటువంటి చర్చకు తెరలేపారు. గంభీర్కు మద్దతుగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. రోహిత్ను టీ20 ఫార్మాట్ అయిన కెప్టెన్గా ఎంపిక చేయాలని గంభీర్ వాదించాడు. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కూడా సున్నితంగా తిరస్కరించింది. ఒక కంపెనీకి ఒక్కడే సీఈవో ఉన్నట్టే ఒక్క జట్టుకు ఒక్కడే కెప్టెన్ ఉండాలని కపిల్దేవ్ లాంటి సీనియర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2020లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ గాయపడ్డాడు. దీంతో బీసీసీఐ రోహిత్ను టీం ఇండియా జట్టుకు ఎంపికచేయలేదు. కానీ ఆ తర్వాత రోహిత్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. తాను ఫిట్గానే ఉన్నానని సంకేతం పంపించాడు.
చివరకు బీసీసీఐ రెండు టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ను ఎంపికచేసింది. బీసీసీఐ చైర్మన్ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘రోహిత్ లాంటి ఆటగాడిని మేం ఎందుకు వదులుకుంటాం. కానీ అతడు ప్రస్తుతం ఫిట్గా లేడు అందుకే ఎంపికచేయలేదు. ఇప్పుడు అతడిని ఎంపిక చేస్తే.. ఒకవేళ గాయం ఎక్కువైతే భవిష్యత్లో ఇబ్బంది అవుతుంది. రోహిత్కు ఎంతో భవిష్యత్ ఉంది’ అంటూ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే రోహిత్ మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేదు.
ఈ విషయంపై తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘రోహిత్ ఈ టెస్ట్ సీరిస్కు ఎందుకు రాలేదో తెలియదు. అతడి గాయంపై కూడా సమాచారం లేదు. అతడి రాకపై ప్రస్తుతం పూర్తి గందరగోళం నెలకొన్నది. రోహిత్ ఆస్ట్రేలియా టూర్కు వస్తాడని మేమంతా భావించాం. అతడు విమానం ఎక్కుతాడని ఎదురుచూశాం. కానీ రోహిత్ మాత్రం రాలేదు. మేం ఎదురుచూపుల ఆట ఆడాం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కాగా గాయం కారణంగానే తాను రాలేకపోతున్నానని, రావడం లేదని రోహిత్ మెయిల్ పంపినట్టు సమాచారం.
