Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ వద్దంటున్న బ్రెజిల్​.. ఇంత జరిగినా ఇంకా బుద్ధిరాలేదా?

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:30 PM GMT
వ్యాక్సిన్​ వద్దంటున్న బ్రెజిల్​..  ఇంత జరిగినా ఇంకా బుద్ధిరాలేదా?
X
కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచదేశాలన్నీ ఆతృతతో ఎదురుచూస్తున్న వేళ.. బ్రెజిల్​ అధ్యక్షుడు జెయిర్​ బోల్సోనారో మాత్రం భిన్నమైన వాదనలు చేస్తున్నాడు. ‘ నేను వ్యాక్సిన్​ తీసుకోనూ’ అంటూ ఆయన ఇటీవల అన్నాడు. ఈ మాటలు సోషల్​మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. కరోనా పై బోల్సోనారో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మాస్క్​ పెట్టుకోవద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలకు ఇష్టం లేకపోతే మాస్కులు పెట్టుకోవద్దు. వాళ్లను బలవంతం చేయలేం’ అని ఆయన అన్నాడు. అయితే తాజాగా వ్యాక్సిన్​పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బ్రెజిల్​ ప్రజలు వ్యాక్సిన్​లకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్మాల్​ఫాక్స్​ వాక్సిన్​ ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని 1904 నవంబర్‌ నెలలో బ్రెజిల్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము వ్యాక్సిన్​ వేసుకోబోమంటూ ప్రభుత్వంతో తగాదాకు దిగారు. ఈ సమయంలో అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే ఇందుకు కారణం అప్పట్లో టీకాలు ఇచ్చే సిరంజీలు చాలా పెద్దవిగా ఉండేవి. టీకా తీయుంచుకున్న దగ్గర విపరీతంగా గాయం అయ్యేది. చాలా రోజులపాటు ఆ గాయం అలాగే ఉండిపోయేది. కొందరిలో గాయం పుండుగా మారి చాలానెలలకు తగ్గేది.

ఇప్పటికీ చాలా మంది కి ఈ టీకాలకు సంబంధించిన మచ్చలు ఉంటాయి. బ్రెజిల్​లో టీకా పంపిణీ సరిగ్గా జరగకపోవడంతో 1904లో మశూచి కారణంగా రియో నగరంలో 0.4 శాతం మంది చనిపోయారు. అప్పట్లో అక్కడి ప్రజలకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగేది. చివరకు బ్రెజిల్‌ ప్రభుత్వం అన్ని అంటురోగాల వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. ఆ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి ఎంతో ప్రచారం చేసింది. దీంతో 1990 దశకంలో 95 శాతం దేశ ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బ్రెజిల్​ అధ్యక్షుడు ఇలా మాట్లాడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.