Begin typing your search above and press return to search.

కరోనా అంతం రామ మందిరంతోనే: బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   29 July 2020 8:00 PM IST
కరోనా అంతం రామ మందిరంతోనే: బీజేపీ ఎంపీ
X
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి అంతం ఎప్పుడు అని ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. దీనికి మందులు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు అరిగోసపడుతున్నారు.

ప్రస్తుతం దేశంలో కేసులు జెట్ స్పీడుతో పెరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ జస్కౌర్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన వెంటనే ఈ వైరస్ నాశనమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా ఎంపీ జస్కౌర్ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయోధ్య రామజన్మ భూమిలో భూమిపూజకు వేళైంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ మందిర నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. దీంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కరోనా అంతానికి రామ మందిర నిర్మాణానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు.