Begin typing your search above and press return to search.

కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే బలి!

By:  Tupaki Desk   |   30 Nov 2020 3:00 PM IST
కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే బలి!
X
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులను బలి తీసుకున్నది. ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్​లోని రాజసమంద్ ఎమ్మెల్యే కిరణ్​ మహేశ్వరికు ఇటీవల కరోనా సోకింది. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే హర్యానా గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమెకు కొన్నిరోజులుగా వెంటిలేటర్​పై చికిత్సనందిస్తూ వచ్చారు. ఆధునాతన వైద్యం అందించారు. కిరణ్​ మహేశ్వరిని బతికించేందుకు తాము చివరవరకు ప్రయత్నించామని, కానీ కాపాడలేకపోయమని వైద్యులు చెప్పారు. ఆమె భౌతికకాయాన్ని మేదాంత ఆసుపత్రి నుంచి ఉదయ్‌పూర్‌కు తరలించారు.

సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మహేశ్వరి మృతిపట్ల బీజేపీ కార్యకర్తలు, రాజసమంద్​ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించే నేత తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని వారు వారు వేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కిరణ్​ మహేశ్వరి కరోనా లాక్​డౌన్​ తో ఇంట్లో నే ఉండి పోయారు. కానీ లాక్​ డౌన్​ ఎత్తేశాక.. ప్రజల మధ్యకు వెళ్లారు. కరోనా తో ఉపాధి కోల్పోయిన పలువురి కి ఆమె అండగా నిలబడ్డారు. నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం అందించారు. ఆ సమయంలోనే ఆమె కు కరోనా సోకింది. ఆమె మృతి తో నియోజకవర్గ ప్రజలు శోక సంద్రలో మునిగి పోయారు.