Begin typing your search above and press return to search.

ఖుష్టూ కు బీజేపీ కౌంటర్ అటాక్

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:22 AM GMT
ఖుష్టూ కు బీజేపీ కౌంటర్ అటాక్
X
సినీ ప్రముఖులు రాజకీయాల్లో చేరి దూకుడు పెంచుతున్న రోజులివీ. వారిపై స్వతహా గానే రాజకీయాల్లో ఉన్న వారు కామెంట్ చేయలేని పరిస్థితులున్నాయి. పైగా లేడీ సినీ రాజకీయ ప్రముఖుల ను టచ్ చేయలేని పరిస్థితి. అందుకే తమ తమ పార్టీల్లో సినీ రంగంనుంచి వచ్చిన వారినే వారిపై దాడికి ధీటుగా నిలబెడుతున్నారు.

తాజాగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి , ప్రముఖ నటి అయిన కుష్బూ పౌరసత్వం పై చేసిన విమర్శలకు బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీ రఘురామ్ గట్టి కౌంటర్ ఇస్తూ నిప్పులు చెరిగారు. ట్విట్టర్ లో ఈ మేరకు గాయత్రి రఘురామ్ స్పందించారు.

‘కుష్బూ నువ్వెప్పుడైనా నిజాలు మాట్లాడావా? అన్ని అబద్దాలే.. నీలాంటి అసత్య వాదులకు, కాంగ్రెస్ నాయకులకు విమర్శించే హక్కులేదని’ గాయత్రీ రఘురామ్ ట్వీట్ లో కడిగేసింది.

అంతకు ముందు కుష్ఫు తమిళనాడు బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకుడు హెచ్. రాజా పై మాటల దాడి చేసింది. పౌరసత్వం చట్టం పై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఆమెకు పోటీ గా గాయత్రి రఘురామ్ ను దించి బీజేపీ కౌంటర్ ఇచ్చింది.