Begin typing your search above and press return to search.
బిజ్జం రీ ఎంట్రీ!... టీడీపీకి కలిసొచ్చేదెంత?
By: Tupaki Desk | 31 March 2019 5:48 PMకర్నూలు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా మారిన కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చినా... ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ఈ జిల్లా నేతలు రంగంలోకి దిగుతుంటారు. రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు వారి ఆధీనంలోనే ఉన్నాయని చెప్పాలి. ఇతర సామాజికవ వర్గాల నేతలున్న నియోజకవర్గాల్లోనూ రెడ్డి సామాజిక వర్గాలదే ఆధిపత్యం కొనసాగుతున్న వైనం కూడా ఈ జిల్లాలో ప్రత్యక్షంగానే చూడొచ్చు. ఇలాంటి నేపథ్యమున్న కర్నూలు జిల్లాలో ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిల్లాలో పదిహేనేళ్ల క్రితం దాకా క్రియాశీలక నేతగానే ఉన్న బిజ్జం పార్థసారధి రెడ్డి... ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ అయిపోయారు. టీడీపీలో ఓ దఫా ఎమ్మెల్యేగా వ్యవహరించిన బిజ్జం... ఆ మరుసటి ఎన్నిక (2004)లోనే ఓటమిపాలయ్యారు.
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం అక్కడే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఫ్యాక్షన్ గొడవలున్న బిజ్జం... వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ చొరవతోనే కాటసానితో రాజీ కుదుర్చుకుని వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. దాదాపుగా 15 ఏళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటూ వస్తున్న బిజ్జం... గడచిన ఎన్నికల్లో పార్టీ నుంచి పిలుపు వచ్చినా కూడా పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. అయితే ఈ దఫా మాత్రం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు రాగానే పరుగులు పెట్టుకుంటూ వచ్చేసిన బిజ్జం...మరోమారు తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. పాణ్యం ఎమ్మెల్యేగానే గెలిచిన బిజ్జం... పాణ్యంలోనూ కాటసాని చేతిలో ఓటమి చవిచూశారు. పాణ్యం కేంద్రంగానే రాజకీయం నెరపిన ఈయనకు... పాణ్యంతో పాటుగా బనగానపల్లె - డోన్ నియోజకవర్గాల్లోనూ కొంతమేర పట్టుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కీలక ఎన్నికలుగా పరిగణిస్తున్న ప్రస్తుత ఎన్నికలల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు కూడా చంద్రబాబు సాహసించడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాల్లో పట్టున్న నేతను వినియోగించుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంతో బిజ్జం రీ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు.
అయితే చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా మూడు నియోజకవర్గాల ఫలితాలను బిజ్జం ప్రభావితం చేయగలరా? అన్న వాదన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిజ్జం తండ్రి సత్యం రెడ్డి బతికుండగా... ఈ ఫ్యామిలీకి మంచి పట్టే ఉండేది. అయితే ఫ్యాక్షన్ కక్షల్లో సత్యం రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగాపార్థసారధి రెడ్డి అనివార్యంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తండ్రి తరహాలో కేడర్ను కాపాడుకోవడంలో పార్థసారధి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. 1999లో ఒక్కసారి మాత్రమే పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బిజ్జం... ఆ మరుసటి ఎన్నికల్లోనే ఓటమిపాలు కావడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక బిజ్జం ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించారు. పాణ్యం నుంచి ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని... గడచిన ఎన్నికల్లో ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీకి కూడా చుక్కలు చూపారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయం సాధించగా... టీడీపీ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డిని మూడో స్థానానికి నెట్టేసిన కాటసాని.. రెండో స్థానంలో నిలిచారు. ఏకంగా 60 వేల ఓట్లకు పైగా సంపాదించారు.
తాజాగా మారిన రాజకీయ పరిణామల నేపథ్యంలో కాటసాని వైసీపీలో చేరగా... వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గౌరు ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీలోకి చేరిపోయింది. ఈసారి పాణ్యం టీడీపీ అభ్యర్థిగా గౌరుకే టికెట్ దక్కింది. ఇప్పుడు బిజ్జం ఎంట్రీ ఇచ్చినా గౌరుకు మద్దతుగా ప్రచారం చేయడం మినహా చేసేదేమీ లేదనే చెప్పాలి. అంతేకాకుండా 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జం... తన అనుచర వర్గాన్ని దాదాపుగా దూరం చేసుకున్నారు. సో.. సొంత నియోజకవర్గంలోనే బిజ్జం వెంట నడిచే వారు పెద్దగా లేరనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తన బంధువర్గమో, లేదంటే గతంలో తన వెంట నడిచిన వారో బనగానపల్లె, డోన్ లలో ఉన్నా... ఇప్పుడు ఈయన వెంట వారంతా నడుస్తారా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పక తప్పదు. మొత్తంగా గ్రౌండ్ రియాలిటీని చూస్తే... బిజ్జం పెద్దగా ప్రభావమేమీ చూపే అవకాశాలేమీ లేదన్న వాదనే బలంగా వినిపిస్తోంది. వెరసి బిజ్జం ఎంట్రీ టీడీపీకి లాభించకపోగా... అటు వైసీపీకి కూడా పెద్దగా నష్టం జరిగే అవకాశాలు లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం అక్కడే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఫ్యాక్షన్ గొడవలున్న బిజ్జం... వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ చొరవతోనే కాటసానితో రాజీ కుదుర్చుకుని వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. దాదాపుగా 15 ఏళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటూ వస్తున్న బిజ్జం... గడచిన ఎన్నికల్లో పార్టీ నుంచి పిలుపు వచ్చినా కూడా పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. అయితే ఈ దఫా మాత్రం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు రాగానే పరుగులు పెట్టుకుంటూ వచ్చేసిన బిజ్జం...మరోమారు తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. పాణ్యం ఎమ్మెల్యేగానే గెలిచిన బిజ్జం... పాణ్యంలోనూ కాటసాని చేతిలో ఓటమి చవిచూశారు. పాణ్యం కేంద్రంగానే రాజకీయం నెరపిన ఈయనకు... పాణ్యంతో పాటుగా బనగానపల్లె - డోన్ నియోజకవర్గాల్లోనూ కొంతమేర పట్టుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కీలక ఎన్నికలుగా పరిగణిస్తున్న ప్రస్తుత ఎన్నికలల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు కూడా చంద్రబాబు సాహసించడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాల్లో పట్టున్న నేతను వినియోగించుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంతో బిజ్జం రీ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు.
అయితే చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా మూడు నియోజకవర్గాల ఫలితాలను బిజ్జం ప్రభావితం చేయగలరా? అన్న వాదన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిజ్జం తండ్రి సత్యం రెడ్డి బతికుండగా... ఈ ఫ్యామిలీకి మంచి పట్టే ఉండేది. అయితే ఫ్యాక్షన్ కక్షల్లో సత్యం రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగాపార్థసారధి రెడ్డి అనివార్యంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తండ్రి తరహాలో కేడర్ను కాపాడుకోవడంలో పార్థసారధి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. 1999లో ఒక్కసారి మాత్రమే పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బిజ్జం... ఆ మరుసటి ఎన్నికల్లోనే ఓటమిపాలు కావడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక బిజ్జం ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించారు. పాణ్యం నుంచి ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని... గడచిన ఎన్నికల్లో ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీకి కూడా చుక్కలు చూపారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయం సాధించగా... టీడీపీ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డిని మూడో స్థానానికి నెట్టేసిన కాటసాని.. రెండో స్థానంలో నిలిచారు. ఏకంగా 60 వేల ఓట్లకు పైగా సంపాదించారు.
తాజాగా మారిన రాజకీయ పరిణామల నేపథ్యంలో కాటసాని వైసీపీలో చేరగా... వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గౌరు ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీలోకి చేరిపోయింది. ఈసారి పాణ్యం టీడీపీ అభ్యర్థిగా గౌరుకే టికెట్ దక్కింది. ఇప్పుడు బిజ్జం ఎంట్రీ ఇచ్చినా గౌరుకు మద్దతుగా ప్రచారం చేయడం మినహా చేసేదేమీ లేదనే చెప్పాలి. అంతేకాకుండా 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జం... తన అనుచర వర్గాన్ని దాదాపుగా దూరం చేసుకున్నారు. సో.. సొంత నియోజకవర్గంలోనే బిజ్జం వెంట నడిచే వారు పెద్దగా లేరనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తన బంధువర్గమో, లేదంటే గతంలో తన వెంట నడిచిన వారో బనగానపల్లె, డోన్ లలో ఉన్నా... ఇప్పుడు ఈయన వెంట వారంతా నడుస్తారా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పక తప్పదు. మొత్తంగా గ్రౌండ్ రియాలిటీని చూస్తే... బిజ్జం పెద్దగా ప్రభావమేమీ చూపే అవకాశాలేమీ లేదన్న వాదనే బలంగా వినిపిస్తోంది. వెరసి బిజ్జం ఎంట్రీ టీడీపీకి లాభించకపోగా... అటు వైసీపీకి కూడా పెద్దగా నష్టం జరిగే అవకాశాలు లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.