Begin typing your search above and press return to search.
ట్విస్టులకే ట్విస్ట్!... వైసీపీలోకి బిజ్జం!
By: Tupaki Desk | 4 April 2019 4:23 PM2019 ఎన్నికలకు సంబంధించి ఏపీలో లెక్కలేనన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అధికార టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వైసీపీలోకి చేరిపోయారు. వీరిలో సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు - ఆయా జిల్లాల్లో కీలక నేతలుగా భావిస్తున్న నేతలంతా వైసీపీ గూటికి చేరిపోయారు. వరుసగా జరుగుతున్న ఈ చేరికలతో అధికార పార్టీ టీడీపీ నిజంగానే బేజారైందని చెప్పక తప్పదు. వలసలను ఆపేందుకు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏకంగా పోలిట్ బ్యూరో భేటీ పెట్టి చర్చలు జరిపినా... నేతల కట్టడి సాధ్యం కాలేదు. ఇలాంటి ట్విస్టులతో డంగైపోయిన టీడీపీకి ఇప్పుడు ఆ ట్విస్టులన్నింటికీ పెద్ద ట్విస్టుగా భావిస్తున్న ఘటన ఒకటి జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ ట్విస్ట్ చోటుచేసుకుంది.
జిల్లా టీడీపీకి సంబంధించి ఓ బలమైన నేత త్వరలో రంగంలోకి దిగనున్నారంటూ - ఆయన రాకతో వైసీపీకి పట్టున్న పాణ్యంతో పాటు బనగానపల్లె - డోన్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి పెద్ద మేలు జరుగుతుందని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఆయనే పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారిధి రెడ్డి. 2004 ఎన్నికల తర్వాత తన చిరకాల ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఉన్న ఫ్యాక్షన్ కక్షలకు స్వస్తి పలికిన బిజ్జం... పదిహేనేళ్లుగా జిల్లాకు దూరంగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే బిజ్జం నాడు రాజీ పడి వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమని భావించిన చంద్రబాబు... అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఈ క్రమంలోనే రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జంకు కబురు పంపి పిలిపించుకున్నారు. బాబుతో చర్చల అనంతరం బిజ్జం తిరిగి పాలిటిక్స్ లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు కూడా.
ఈ వార్త కర్నూలు జిల్లాలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగానే ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బాబు చెప్పినట్లుగానే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన బిజ్జం... చంద్రబాబుకు భారీ షాకిస్తూ వైసీపీలో చేరిపోయారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ ప్రచార రథంపై ప్రత్యక్షకమైన బిజ్జం... జగన్ చేత వైసీపీ కండువాను కప్పేసుకున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. టీడీపీ నేతగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ నేత తిరిగి క్రియాశీలకంగా మారిపోతారని, దీంతో జిల్లాలో ఓ మూడు నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశగా ఉన్న టీడీపీకి ఈ పరిణామం శరాఘాతమేనని చెప్పాలి. ఇప్పటిదాకా టీడీపీకి తగిలిన ఎదురు దెబ్బల్లోకెల్లా అత్యంత పెద్ద దెబ్బ ఇదేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
జిల్లా టీడీపీకి సంబంధించి ఓ బలమైన నేత త్వరలో రంగంలోకి దిగనున్నారంటూ - ఆయన రాకతో వైసీపీకి పట్టున్న పాణ్యంతో పాటు బనగానపల్లె - డోన్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి పెద్ద మేలు జరుగుతుందని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఆయనే పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారిధి రెడ్డి. 2004 ఎన్నికల తర్వాత తన చిరకాల ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఉన్న ఫ్యాక్షన్ కక్షలకు స్వస్తి పలికిన బిజ్జం... పదిహేనేళ్లుగా జిల్లాకు దూరంగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే బిజ్జం నాడు రాజీ పడి వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమని భావించిన చంద్రబాబు... అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఈ క్రమంలోనే రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జంకు కబురు పంపి పిలిపించుకున్నారు. బాబుతో చర్చల అనంతరం బిజ్జం తిరిగి పాలిటిక్స్ లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు కూడా.
ఈ వార్త కర్నూలు జిల్లాలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగానే ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బాబు చెప్పినట్లుగానే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన బిజ్జం... చంద్రబాబుకు భారీ షాకిస్తూ వైసీపీలో చేరిపోయారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ ప్రచార రథంపై ప్రత్యక్షకమైన బిజ్జం... జగన్ చేత వైసీపీ కండువాను కప్పేసుకున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. టీడీపీ నేతగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ నేత తిరిగి క్రియాశీలకంగా మారిపోతారని, దీంతో జిల్లాలో ఓ మూడు నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశగా ఉన్న టీడీపీకి ఈ పరిణామం శరాఘాతమేనని చెప్పాలి. ఇప్పటిదాకా టీడీపీకి తగిలిన ఎదురు దెబ్బల్లోకెల్లా అత్యంత పెద్ద దెబ్బ ఇదేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.