Begin typing your search above and press return to search.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ లో తీర్మాణం..మోడీ పై మమతా ఫైర్ !
By: Tupaki Desk | 28 Jan 2021 6:30 PM ISTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే , ఈ మూడు సాగు చట్టాలు ఇప్పుడు దేశంలో కాకరేపుతున్నాయి. ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలి అంటూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా రిపబ్లిక్ డే రోజు ..కిసాన్ పరేడ్ కూడా నిర్వహించారు. ఈ కిసాన్ పరేడ్ లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పంజాబ్,కేరళ,రాజస్తాన్ సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు పాస్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న తీర్మానాన్ని గురువారం బెంగాల్ అసెంబ్లీలో మమత సర్కార్ ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులకు వ్యతిరేకం..కార్పొరేట్లకు అనుకూలం అని పేర్కొంటూ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థ చటర్జీ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణం సభలో ప్రవేశపెట్టగానే..దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత మనోజ్ టిగ్గా నేతృత్వంలో కాషాయపార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు వెల్ లోకి వెళ్లారు. ఆ తర్వాత సభ నుండి వాకౌట్ చేశారు.
రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఎంత మాత్రమూ ఆమోదించేది లేదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం వెంటనే చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఆందోళనని టెర్రరిస్ట్ కార్యక్రమంగా బీజేపీ పేర్కొంటుందని అన్నారు. రైతులను దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని తాము అంగీకరించబోమని..వారు దేశానికి ఆస్తులని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ట్టాలను ఉపసంహరించుకో లేకుంటే ప్రధాని పదవికి రాజీనామా చేయ్యి అంటూ ఆమో మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న తీర్మానాన్ని గురువారం బెంగాల్ అసెంబ్లీలో మమత సర్కార్ ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులకు వ్యతిరేకం..కార్పొరేట్లకు అనుకూలం అని పేర్కొంటూ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థ చటర్జీ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణం సభలో ప్రవేశపెట్టగానే..దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత మనోజ్ టిగ్గా నేతృత్వంలో కాషాయపార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు వెల్ లోకి వెళ్లారు. ఆ తర్వాత సభ నుండి వాకౌట్ చేశారు.
రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఎంత మాత్రమూ ఆమోదించేది లేదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం వెంటనే చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఆందోళనని టెర్రరిస్ట్ కార్యక్రమంగా బీజేపీ పేర్కొంటుందని అన్నారు. రైతులను దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని తాము అంగీకరించబోమని..వారు దేశానికి ఆస్తులని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ట్టాలను ఉపసంహరించుకో లేకుంటే ప్రధాని పదవికి రాజీనామా చేయ్యి అంటూ ఆమో మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
