Begin typing your search above and press return to search.

రూల్స్​ బ్రేక్​ చేసిన ఇంగ్లండ్​ ఆల్ రౌండర్.. బంతికి ఉమ్మిరుద్దాడు..!

By:  Tupaki Desk   |   28 March 2021 12:30 AM GMT
రూల్స్​ బ్రేక్​ చేసిన ఇంగ్లండ్​ ఆల్ రౌండర్.. బంతికి ఉమ్మిరుద్దాడు..!
X
బంతిని షైన్​ చేసేందుకు క్రికెట్​ ప్లేయర్లు బంతికి ఉమ్మి రుద్దుతుంటారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఉంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కోరలు చాచిన ప్రస్తుత తరుణంలో క్రికెట్​ లో కొత్త రూల్స్​ తీసుకొచ్చారు. అందులో భాగంగా బంతికి ఉమ్మి రుద్దడం నిషేధం.. మొదటి సారి ఎవరైనా ఇలా చేస్తే వార్నింగ్​ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం సదరు జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లండ్​ కు భారత జట్టుకు మధ్య వన్డే సీరిస్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రెండో వన్డే జరిగింది.

ఈ మ్యాచ్​ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ సెలైవా ఉపయోగించాడు. బంతికి ఉమ్మి రుద్దాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో రీస్‌ టోప్లీ.. నాలుగో ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్‌ సెలైవా రుద్దాడు. దీంతో అంపైర్​ వీరేందర్​ శర్మ అతడికి వార్నింగ్​ ఇచ్చాడు. ఈ ఘటన మరోసారి రిపీట్​ అయితే జరిమానా తప్పదని హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్​లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 336 పరుగులు చేసింది. కేఎల్​ రాహుల్​ సెంచరీ చేశాడు. కానీ ఇంగ్లండ్​ జట్టు చాలా తేలిగ్గా ఈ మ్యాచ్​లో విజయం సాధించింది. భారత్​ భారీ స్కోరు సాధించినప్పటికి బౌలర్లు ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతే.. ఇంగ్లాండ్​ తేలిగ్గా విజయం సాధించింది. కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.బెయిర్​ స్టో 124 పరుగులు తీయగా.. బెన్​ స్టోక్స్​ 99 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్​ చాలా తేలిగ్గా విజయం సాధించింది.