Begin typing your search above and press return to search.

బీజేపీలోకి జానారెడ్డి చేరిక పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Dec 2020 9:18 AM IST
బీజేపీలోకి జానారెడ్డి చేరిక పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X
తెలంగాణలో రోజురోజుకు దిగజారిపోతున్న కాంగ్రెస్ దుస్థితి చూసి ఆ పార్టీ నేతలంతా చేజారిపోతున్నారు. కాంగ్రెస్ లోనే పుట్టి, ఎదిగిన కురువృద్ధుడు సీనియర్ నేత జానారెడ్డి సైతం పార్టీ మారుతున్నాడని.. బీజేపీలో చేరి ఆ పార్టీ తరుఫునే నాగార్జున సాగర్ నుంచి పోటీచేస్తాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఘోర పరాజయం నేపథ్యంలో జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

త్వరలో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక రానుంది. దీంతో బీజేపీ నేతలు ఇప్పటి నుంచి నాగార్జున్ సాగర్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నాగార్జున్ సాగర్లో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది. కుమారుడితోపాటు జనారెడ్డి సైతం బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తనకు జానారెడ్డి నుంచి ఫోన్ కాల్ రాలేదని.. అయితే జానారెడ్డి.. ఆయన కుమారుడు వేర్వేరు కాదని అన్నారు. జానారెడ్డి చేరికపై బండి సంజయ్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. జానారెడ్డి బీజేపీలో చేరితే రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు మొండుగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితాన్నే రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో బీజేపీ ఆకర్ష్ నాగార్జున్ సాగర్లో ఇప్పటికే మొదలైంది.

వైఎస్ఆర్ హయాంలో జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్ నగరాన్ని పాలించిన కాంగ్రెస్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే..! ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.