Begin typing your search above and press return to search.

ఈ మంత్రం వేస్తే కరోనా పోతుందట.. బాలయ్య వాక్కు

By:  Tupaki Desk   |   31 Aug 2020 5:30 PM GMT
ఈ మంత్రం వేస్తే కరోనా పోతుందట.. బాలయ్య వాక్కు
X
నందమూరి బాలక్రిష్ణ.. ఆయన వెండితెరపై తొడగొట్టినా.. తెరబయటా తొడగొట్టినా విజిల్స్ వేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ బాలయ్య డిఫెరెంట్ అని నిరూపించుకున్నారు. ఫ్యాన్స్ కూడా బాలయ్యను గుండెల్లో గూడు కట్టుకున్నారు.బాలయ్య నటనకు.. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం పోలిక ఉండదని బాలయ్య చాలాసార్లు నిరూపించారు.

బాలయ్య ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఎవరైనా చిరాకుపెడితే చెంపపై ఒక్కటేస్తారు. ముక్కుమీదే కోపం ఉంటుంది. అంతేకాదు.. బాలయ్యలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. చాలా సభలు, సమావేశాల్లో ఆయన పురాణాల గురించి.. పద్యాలు పాడి అలరిస్తుంటారు.

ప్రస్తుతానికి బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి కొనసాగుతున్నారు. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా బాలయ్య తన నియోజకవర్గానికే వెళ్లలేకపోయారు. సోమవారం వీలుచూసుకొని హిందూపురంలో పర్యటించారు.

సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం లెటర్ రాశానని ఎమ్మెల్యే బాలయ్య తెలిపారు. హిందూపురం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించడానికేనని అన్నారు. తన నియోజకవర్గంలో పర్యటించి.. తాజాగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి రూ.55 లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు.. పరికరాలు అందజేశారు.

ఇక బాలయ్యకు ఘనస్వాగతం పలికిన జనాలను చూసి.. కరోనాకు భయపడవద్దని.. ఈ మంత్రం జపించాలని సూచించారు. లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని జపించారు. ‘అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో!’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా రాదన్నారు. ప్రజలంతా ఈ మంత్రాన్ని పఠించాలని సూచించారు.

దీంతో బాలయ్య మంత్రం వేస్తే.. కరోనా ఏంటీ.. దానమ్మ మొగుడైనా పరార్ కావాల్సిందేనంటూ అక్కడున్న వారు సెటైర్లు వేయడం కనిపించింది.