Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మరో దారుణం..రాళ్లతో దాడి

By:  Tupaki Desk   |   3 Oct 2018 8:04 AM GMT
హైదరాబాద్ లో మరో దారుణం..రాళ్లతో దాడి
X
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో క్రైం రేటు ఎక్కువగా పెరిగిపోతోంది. మొన్నీ మధ్య నడిరోడ్డుపై వ్యక్తి హత్య.. అంతకుముందు సొంత కూతురి పైనే తండ్రి పరువు దాడి మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది.

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆటోడ్రైవర్ అర్జున్ పై నలుగురు దుండగులు రాళ్లు - కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అర్జున్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అర్జున్ తన స్నేహితులను సింగరేణి కాలనీ దింపి వస్తుండగా ఈ దాడి జరిగింది. నడిరోడ్డుపై రౌడీలు దౌర్జన్యం చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన వారిని కూడా వీళ్లు రాళ్లతో కొట్టారు. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దాడికి పాల్పడ్డ వారిని సింగరేణి కాలనీకి చెందిన లక్ష్మణ్ - గోపి - మహేష్ - పవన్ లుగా పోలీసులు గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అర్జున్ పై పాత పగలతో దాడి చేయడానికి ఈ నలుగురు వచ్చినట్టు సమాచారం. ఇదివరకూ డబ్బుల విషయంలో అర్జున్ కు, మిగతా నలుగురు దుండగులకు మధ్య వివాదం నడించింది. తాజాగా మరోసారి అర్జున్ సింగరేణి కాలనీలో వారి కంటపడడంతో వీరు దాడికి పాల్పడ్డట్టు తెలిసింది.