Begin typing your search above and press return to search.

మ్యాచ్​లో బూతులు తిట్టి.. ఇప్పుడేమో క్షమాపణలా?

By:  Tupaki Desk   |   12 Jan 2021 2:38 PM IST
మ్యాచ్​లో బూతులు తిట్టి.. ఇప్పుడేమో క్షమాపణలా?
X
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత బ్యాట్స్​మెన్ లు మెరుగ్గా రాణించి మ్యాచ్​ను డ్రా చేసిన విషయం తెలిసిందే. టెస్ట్​ క్రికెట్​లో తమ ప్రదర్శనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. అయితే మూడో టెస్ట్​ ఆఖరి రోజు హనుమ విహారీ.. రవిచంద్రన్​ అశ్విన్​ ఎంతో ఓపిగ్గా ఆడి వికెట్లను నిలబెట్టి చాలా సేపు క్రీజ్​లో ఉన్నారు. దీంతో మ్యాచ్​ డ్రాగా ముగిసింది. అయితే రవిచంద్రన్​, విహారి క్రీజ్​లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​.. విచక్షణ కోల్పోయాడు. ఈ సందర్భంగా అశ్విన్​పై బూతుల వర్షం కురిపించాడు. అయితే అశ్విన్​ కూడా దీటుగానే బదిలిచ్చాడు.

కాగా పైన్​ మాటలు స్టంప్​మైక్​లో రికార్డయ్యాయి. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కీలక సమయాల్లో ప్రత్యర్థి జట్టుపై తిట్ల వర్షం కురిపించడం ఆస్ట్రేలియాకు కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు ఇటువంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి ఇదే రిపీట్​ అయ్యింది.
అయితే పైన్​ మాటలపై విమర్శలు రావడంతో అతడు క్షమాపణ చెప్పాడు. ‘క్రికెట్​లో స్టంప్​మైక్​ ఉంటుందని తెలుసు. అయితే నేను దురదృష్టవశాత్తు నోరుజారాను. అలా చేసి ఉండాల్సింది కాదు. గేమ్​ లో జాగ్రత్తగా ఉండాలని తెలుసు. కానీ నేను సహనం కోల్పోయా. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా’ అంటూ కిమ్​ పేర్కొన్నారు.


మూడో రోజు ఆటలో పుజారా ఔట్ కోసం పైన్ అంపైర్ విల్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.

ఆఖరిరోజు మ్యాచ్​ సాగుతుండగా.. రవిచంద్రన్​ అశ్విన్​.. హనుమ విహారి క్రీజులో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్​ లైయన్​ బౌలింగ్​ వేస్తుండగా.. అశ్విన్​ చెస్ట్​గాడ్​ కోసం క్రీజు నుంచి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా కీపింగ్​ చేస్తున్న పైన్​.. 'గబ్బా(చివరి టెస్టు వేదిక)కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్‌.. చెప్పింది అర్థమైందా'' అంటూ రెచ్చగొట్టాడు. ‘మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం. నీకది చివరి సిరీస్‌ అవుతుంది'అని అశ్విన్‌ కూడా గట్టిగానే కౌంటర్​ ఇచ్చాడు. అయితే పైన్​ మాటలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.