Begin typing your search above and press return to search.

వైఎస్ అనుచరుడు సూరీడుపై అల్లుడి హత్యాయత్నం

By:  Tupaki Desk   |   24 March 2021 8:30 AM GMT
వైఎస్ అనుచరుడు సూరీడుపై అల్లుడి హత్యాయత్నం
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు సూరీడుపై హైదరాబాద్‌ లో దాడి జరిగిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ‌లోని ఆయన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్‌ తో సూరీడుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటన పై వివరాల్లోకి వెళ్తే .. సూరీడు కుమార్తె గంగా భవానీని సురేంద్రనాథ్‌ కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన భవానీ పుట్టింటికి వచ్చేసి అతడిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సురేంద్రనాథ్ భార్య భవానీ, మామ సూరీడుపై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. అయితే, కేసు ఉపసంహరించుకోవడానికి వారు నిరాకరించడంతో కక్ష పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పలువురు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. గతేడాది కూడా ఆయన దాడికి పాల్పడగా సూరీడు తప్పించుకున్నాడట. దీనిపై గంగా భవానీ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు సురేంద్రనాథ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.