Begin typing your search above and press return to search.

దారుణం: కాంగ్రెస్ మహిళా నేతను చితకబాదారు

By:  Tupaki Desk   |   11 Oct 2020 7:15 PM IST
దారుణం: కాంగ్రెస్ మహిళా నేతను చితకబాదారు
X
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో దారుణం జరిగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకురాలు తారా యాదవ్ పై పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. యూపీలోని డియోరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అత్యాచార ఆఱోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్ భాస్కర్ మణికి తాజాగా ఉప ఎన్నికల్లో ముకుంద్ భాస్కర్ టికెట్ ఇవ్వడాన్ని తార వ్యతిరేకించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి ఈడ్చిపడేశారు. కాంగ్రెస్ పార్గీ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమావేశం జరుగుతుండగా మహిళా నేత తార అక్కడికి చేరుకొని ముకుంద్ భాస్కర్ కు టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహంతో కార్యకర్తలు ఆమెపై దాడి చేసి ఈడ్చిపడేశారు. దీనిపై ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. తారాయాదవ్ పై దాడిని బీజేపీ ఖండించింది.

కాగా కాంగ్రెస్ మహిళా నేతపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ డిమాండ్ చేశారు. మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా దీనిపై ప్రశ్నించింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా తమ దృష్టికి వచ్చిందని ట్వీట్ చేశారు.