Begin typing your search above and press return to search.

అటల్​ టన్నెల్​.. ప్రత్యర్థులకు హడల్​

By:  Tupaki Desk   |   4 Oct 2020 6:30 PM IST
అటల్​ టన్నెల్​.. ప్రత్యర్థులకు హడల్​
X
ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ టన్నెల్ మన సైన్యానికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ టన్నెల్​ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. 9.02 కిలోమీటర్ల మేర కొండలను తొలిచి ఈ టన్నెల్ ను నిర్మించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టన్నెల్​. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తున టన్నెల్ ను నిర్మించారు. బయట గాలి ఎంత వేగంగా ప్రయాణిస్తోంది. ఆక్సీజన్​ లెవెల్స్​ ఏ స్థాయిలో ఉన్నాయని టన్నెల్​లో ప్రయాణించే వారికి తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ టన్నెల్​ను ఏర్పాటు చేయడం వల్ల సైనికులు తొందరగా తమ గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం దక్కింది. అంతకు ముందు చాలా సమయం తీసుకునేది.

గతంలో రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణించాలంటే సుమారు ఏడుగంటలు పట్టేది.

అది కూడా కొండలు, నదులు దాటుకుంటా చాలా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ టన్నెల్​ నిర్మాణంతో ఆ బాధలు తప్పనున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో టన్నెల్ ను నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిపుణులు దీని నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. కేవలం వేసవిలోనే ఇక్కడ ప్రయాణం సాధ్యమయ్యేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఎంతోమంది మరణించేవారు కూడా.. ఇక శీతాకాలంలో ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకున్నది. వృద్ధులు, పిల్లలు ఈ దారిలో ఏనాడు వెళ్లలేరు. అయితే ప్రస్తుత టన్నెల్​ నిర్మాణంతో ఆ కష్టాలకు చెక్​పడింది.

వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అతర్వాత వచ్చిన యూపీఏ హయాంలో పనులు మందకొడిగా సాగాయి. మోదీ ప్రధాని అయ్యాక పనుల్లో వేగం పెంచారు. విదేశీ టెక్నాలజీ సాయంతో పనులను పరుగులు పెట్టించారు.