Begin typing your search above and press return to search.
మరి.. గుమ్నామీ బాబా ఎవరు..?
By: Tupaki Desk | 14 Feb 2016 12:11 PM ISTస్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మిస్టరీ మృతికి సంబంధించిన సందేహాలు ఇప్పటికిప్పుడు క్లియర్ అవుతున్న వేళ.. కొత్త సందేహం ఒకటి తెర మీదకు వచ్చింది. బోస్ మరణించింది నిజమే అయిన పక్షంలో.. బోస్ గా ప్రజలు నమ్మే గుమ్నామీ బాబా సంగతేంటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా గుమ్నామీ బాబా గురించిన వివరాలు తేల్చాలని అంటున్నారు బోస్ కుటుంబ సభ్యులు.
తాజాగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆయన నివాసంలో కలిసిన నేతాజీ వారసులు గుమ్నామీ బాబా గురించి ప్రచారంలోని అంశాల్ని తేల్చాలని కోరారు. దీంతో స్పందించిన అఖిలేశ్.. బాబాకు సంబంధించిన వివరాల్ని మరోసారి విచారణ జరుపుతామని.. ఆయనకు సంబంధించిన వివరాల్ని చూసేందుకు వీలుగా ఒక కమిటీని నియమిస్తామని పేర్కొన్నట్లుగా బోస్ వారసులు వెల్లడించారు. బాబా మీద ఉన్న సందేహాల నివృతి అయితే బోస్ మృతిపై ఉన్న డౌట్స్ చాలా వరకూ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
తాజాగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆయన నివాసంలో కలిసిన నేతాజీ వారసులు గుమ్నామీ బాబా గురించి ప్రచారంలోని అంశాల్ని తేల్చాలని కోరారు. దీంతో స్పందించిన అఖిలేశ్.. బాబాకు సంబంధించిన వివరాల్ని మరోసారి విచారణ జరుపుతామని.. ఆయనకు సంబంధించిన వివరాల్ని చూసేందుకు వీలుగా ఒక కమిటీని నియమిస్తామని పేర్కొన్నట్లుగా బోస్ వారసులు వెల్లడించారు. బాబా మీద ఉన్న సందేహాల నివృతి అయితే బోస్ మృతిపై ఉన్న డౌట్స్ చాలా వరకూ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
