Begin typing your search above and press return to search.

ఇది చదివినంతనే.. ఆలస్యం చేయకుండా కొనేయటం ఖాయం

By:  Tupaki Desk   |   18 Nov 2020 1:20 PM IST
ఇది చదివినంతనే.. ఆలస్యం చేయకుండా కొనేయటం ఖాయం
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కోట్లాది మంది ప్రభావితులు కావటం తెలిసిందే. దేశాలకు దేశాలు హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ ఇచ్చిన షాక్ తో కోలుకోని ప్రపంచంలోని దేశాలకు.. తాజాగా సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆయా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కంటికి కనిపించని మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి. అత్యాధునిక సాంకేతిక ఉందని చెప్పే అమెరికా సైతం కరోనాను ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. కరోనా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉన్న అవకాశాల కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిట్కాలకు ఆదరణ పెరిగింది. తాజాగా బ్రిటన్ లోని కార్డిఫ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొత్తవిషయాలు బయటకు వచ్చాయి. మౌత్ వాష్ తో పుక్కిలిస్తే కేవలం 30 సెకన్లలో కరోనా రోగుల్లోని వైరస్ లోడ్ గణనీయంగా తగ్గినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ మౌత్ వాష్ లో కనీసం 0.07 శాతం సిటై పైరిడినియం క్లోరైడ్ ఉండాలని చెబుతున్నారు. కరోనా వైరస్ తీవ్రతను తగ్గించటంపై మౌత్ వాష్ లు ప్రభావవంతంగా పని చేస్తున్న విషయాన్ని తాము గుర్తించినట్ులగా బ్రిటన్ కు చెందిన కార్డిప్ వర్సిటీ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. కరోనా కు చెక్ పెట్టే మౌత్ వాష్ కొనేస్తే పోలా?