Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి పదవి కి శివసేన ఎంపీ రాజీనామా.. మహా పీఠం సేనదేనా?

By:  Tupaki Desk   |   11 Nov 2019 7:02 AM GMT
కేంద్ర మంత్రి పదవి కి శివసేన ఎంపీ రాజీనామా.. మహా పీఠం సేనదేనా?
X
కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం కమల నాథులకు నమ్మకస్తుడైన మిత్రుడి గా ఉన్న శివసేన.. ఇప్పుడు ఆ పార్టీ తో మొదటికంటా సంబంధాల్ని తెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ తో సంబంధాలు పూర్తి గా తెంచుకుంటే తప్పించి మహారాష్ట్ర లో సేన ఏర్పాటు చేసే ప్రభుత్వాని కి తమ మద్దతు ఉండని ఎన్సీపీ చెప్పిన నేపథ్యంలో.. దానికి తగ్గట్లుగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి.

ఈ రోజు (సోమవారం) రాత్రి 7.30 గంటల లోపు శివసేన తన బలాన్ని ప్రదర్శించుకునే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చిన నేపథ్యం లో.. ఆ పార్టీ అధి నాయకత్వం రంగం లోకి దిగింది. ఇందులో భాగంగా మోడీ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న తమ పార్టీ కి చెందిన ఎంపీ అరవింద్ సావంత్ తన కేంద్ర మంత్రి పదవి కి రాజీనామా చేశారు.

మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా.. కొత్త మిత్ర పక్షాలకు సానుకూల సంకేతాల్ని పంపేందుకు శివసేన తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సమయం తక్కువ గా ఉన్న వేళ.. తమ స్నేహం కోసం చేతులు చాచిన శివసేనకు కాంగ్రెస్.. ఎన్సీపీలు దన్ను గా నిలుస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమ ఉమ్మడి శత్రువు బీజేపీని దెబ్బ తీయాలని భావిస్తున్న వేళ.. సోనియా.. పవార్లు సేన సంకేతాలకు సానుకూలం గా స్పందించే అవకాశం ఎక్కువ గా ఉందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.