Begin typing your search above and press return to search.
కరోనా యాంటీబాడీలు వాళ్లు వేగంగా కోల్పోతున్నారు? ఎందుకు
By: Tupaki Desk | 28 Oct 2020 10:45 AM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం గజగజ వణికాయి. అయితే కరోనా అరికట్టేందుకు డబ్ల్యూహెచ్వో చెప్పిన సూచనల ప్రకారం నడుచుకుంటూ పలు దేశాలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అయితే కరోనా ప్రభావంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. ఇమ్యూనిటీ ఉన్నవాళ్లు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగలిగారు. కొంతమందిలో కరోనా లక్షణాలు బయటపడితే.. చాలా మందికి కరోనా ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పలు ఆసక్తికర అధ్యయనాలు బయటపడుతున్నాయి.
కరోనా లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే.. లక్షణాలు లేని వైరస్ బాధితులు వేగంగా యాంటీబాడీలు వేగంగా కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు చేసిన పరిశోధనలు ఈ విషయం తేటతెల్లమైంది. లక్షా 65 వేల మందిపై చేసిన ఈ పరిశోధన లక్షణాలు లేనివారిలో యాంటీబాడీల తగ్గుదల రేటు వేగంగా ఉందని వెల్లడైంది. అంతేకాక, యువకులతో పోలిస్తే 75 ఏళ్లు దాటినవారిలో మరింత వేగంగా యాంటీబాడీలు క్షిణించాయని ఈ పరిశోధన పేర్కొన్నది. ఏది ఏమైనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు ప్రజలు బలమైన ఆహారపదార్థాలు తీసుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోని కరోనాను జయించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే.. లక్షణాలు లేని వైరస్ బాధితులు వేగంగా యాంటీబాడీలు వేగంగా కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు చేసిన పరిశోధనలు ఈ విషయం తేటతెల్లమైంది. లక్షా 65 వేల మందిపై చేసిన ఈ పరిశోధన లక్షణాలు లేనివారిలో యాంటీబాడీల తగ్గుదల రేటు వేగంగా ఉందని వెల్లడైంది. అంతేకాక, యువకులతో పోలిస్తే 75 ఏళ్లు దాటినవారిలో మరింత వేగంగా యాంటీబాడీలు క్షిణించాయని ఈ పరిశోధన పేర్కొన్నది. ఏది ఏమైనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు ప్రజలు బలమైన ఆహారపదార్థాలు తీసుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోని కరోనాను జయించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
