Begin typing your search above and press return to search.

చైనా కుయుక్తులు: ఓడరేవుల్లో ఉత్పత్తులు నిలిపివేత

By:  Tupaki Desk   |   25 Jun 2020 1:00 PM IST
చైనా కుయుక్తులు: ఓడరేవుల్లో ఉత్పత్తులు నిలిపివేత
X
భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు రేగుతోంది. చైనా తన వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అదే కుయుక్తులు పన్నుతోంది. తాజాగా భారతదేశానికి రావాల్సిన ఉత్పత్తులను ఆపేసింది. ఆ దేశ ఉత్పత్తులు దేశంలోని వివిధ ఓడరేవుల్లో నిలిచిపోయాయి. అమెరికన్ కంపెనీలు ఉత్పత్తి చేసిన యాపిల్, సిస్కో, డెల్ ఉత్పత్తులు కూడా వీటిలో ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందకపోయినా.. దేశ ప్రధాన ఓడరేవుల్లోని కస్టమ్స్ అధికారులు చైనా నుంచి వచ్ఛే కంటెయినర్లను ఆపివేస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారు అదనపు క్లియరెన్సులు కావాలని కోరుతున్నారు. అమెరికన్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎస్-ఇండియా స్ట్రాటిజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్ తాజాగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ విదేశీ ఉత్పత్తుల దిగుమతుల విషయం లో.. ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ లేకపోవడంతో చిక్కులు ఎదురవుతున్నాయని పేర్కొంది.

చైనా నుంచి వచ్ఛే ఉత్పత్తులను అధికారులు విమానాశ్రయాలు, రేవుల్లో నిలిపివేస్తున్నారని తెలిపింది. ఈ ధోరణి విదేశీ ఇన్వెస్టర్లను షాక్ కి గురి చేస్తోందని వెల్లడించింది. ఈ ఉత్పత్తుల్లో యాపిల్, సిస్కో, డెల్,తో బాటు ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ ఉత్పత్తి చేసిన ఎలెక్ట్రానిక్ వస్తువులు కూడా వీటి లో ఉన్నాయి. అయితే దేశం లో ఏ రేవుల్లో వీటిని నిలిపి వేస్తున్నారో స్పష్టం కావడం లేదు. కాగా తమ ఆటో పార్టులను చెన్నైలోని ఓ రేవులో నిలిపి వేశారని, అధికారులు కోరిన సమాచారాన్ని తాము అందజేశామని ఫోర్డ్ కంపెనీ వెల్లడించింది.

ఈ విధంగా చైనా కుయుక్తులు పన్నుతూ దేశానికి రావాల్సిన ఉత్పత్తులు ఆపివేయడం ఉత్కంఠగా మారింది. సరిహద్దులు, ఓడరేవుల్లో ఉత్పత్తులు నిలిచిపోవడంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.