Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేనిపై ఆమె ఫిర్యాదు..భ‌ర్త‌తో అలా చేయిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Dec 2018 10:43 AM GMT
చింత‌మ‌నేనిపై ఆమె ఫిర్యాదు..భ‌ర్త‌తో అలా చేయిస్తున్నారు
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - త‌ర‌చూ వివాదాల్లో నిలిచే ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పట్ల అసత్య ఆరోపణలు చేస్తున్నారని - మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె వాపోయారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోకి జోక్యం చేసుకుంటూ త‌న నుంచి దూరంగా ఉంటున్న భ‌ర్త ద్వారా వివాదాలు సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు.

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు టార్గెట్‌ గా చేసుకొని నన్ను బెదిరిస్తున్నారని అపూర్వ వాపోయారు. `` గతంలో మా ఇంటి ముందు ఒక దిమ్మె కడుతున్న సమయంలో వ్యతిరేకించినందుకు న‌న్ను టార్గెట్ చేశారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో నేను చింతమనేనిని ఏదో అన్నానని బెదిరింపులకి దిగుతున్నారు. నా వ్య‌క్తిగ‌త జీవిత అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. మా ఇద్దరి మధ్య గొడవలు రావడంతో నా భర్తతో విడాకులు తీసుకున్నాను. నా భర్తను తీసుకొచ్చి నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు నలుగురిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఆధారాలు పరిశీలించి భాద్యులు పై చర్యలు తీసుకుంటాం అన్నారు.`` అని వాపోయారు.