Begin typing your search above and press return to search.

హోం ఐసోలేషన్ మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్ !

By:  Tupaki Desk   |   27 July 2020 3:40 PM IST
హోం ఐసోలేషన్  మార్గదర్శకాలు  విడుదల చేసిన ఏపీ సర్కార్ !
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా కేసుల సంఖ్య లక్షకి చేరువైంది. ప్రభుత్వం ఎంతగా కరోనా ను అరికట్టాలని చూస్తున్నా కూడా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. గత వారం రోజులుగా కరోనా కేసులు 7 నుండి 8 వేల వరకు నమోదు అవుతున్నాయి. అలాగే ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ఇక , కొందరికి కరోనా సోకినట్టు నిర్దారణ అయినప్పటికీ వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. ఈ సమయంలో కరోనా సోకి హోం ఐసోలేషన్‌ లో ఉండే వారికి ఇప్పటికే ఫ్రీ కిట్‌ను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం , భాదితులు ఎలాంటి జాగ్రతలు పాటించాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏం చేయకూడదో మార్గదర్శకాలు విడుదల చేసింది.

హోమ్ ఐసోలేషన్ లో ఉండేవారు నిద్ర, ఎక్సర్‌సైజ్‌, స్నానం, భోజనం చేసేటప్పుడు తప్ప ఎల్లప్పుడూ మాస్క్ ధరించి ఉండాలి. అలాగే ఉదయం లేవగానే కరోనా సోకిన వ్యక్తి తన రూమ్‌ని తనే క్లీన్ చేసుకోవాలి. ఇతరులకి వీలైనంత ఎక్కువగా దూరంగా ఉండాలి. అలాగే రోగి ధరించిన బట్టలను వేడి నీటిలో తానే ఉతికి ఆరేసుకోవాలి. తన వస్తువులు, పాత్రల్ని తానే కడుక్కోవాలి. బలమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని రోగులు తీసుకోవాలి. డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడాలి. తన ఆరోగ్యంపై రోగి దగ్గర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్త లేదా ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కి తెలుపుతూ ఉండాలి. కరోనా లక్షణాలు పెరుగుతున్నా, బయటపడినా, ఆరోగ్య కార్యకర్తకు చెప్పాలి.

కరొనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉండేవారు. ఇతరులను ఇంట్లోకి రానివ్వకూడదు. అలాగే మీ వస్తువులను ఎవరూ ముట్టుకోకుండా చూసుకోవాలి.ముఖ్యంగా బయటకు వెళ్లకూడదు, ఇతరులను కలవకూడదు. అలాగే రోజుకు రెండు సార్లు విటమిన్‌ సి, రోజుకు రెండు సార్లు మల్టీమిటమిన్‌. రోజుకు ఒకసారి జంక్‌ మాత్ర , జలుబు లేదా దగ్గుఉంటే రోజుకు ఒకసారి సెట్రిజిన్‌ 10మి.గ్రా. తీసుకోవాలి. ఒకవేల జ్వరం ఉంటే రోజుకు రెండు సార్లు పారాసిటమోల్‌ 500 మి.గ్రా. ట్యాబ్లెట్ తీసుకోవాలి.