Begin typing your search above and press return to search.

మరోసారి సత్తాచాటిన ఏపీ .. జాతీయ స్థాయిలో మూడు అవార్డులు !

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:05 PM IST
మరోసారి సత్తాచాటిన ఏపీ .. జాతీయ స్థాయిలో మూడు అవార్డులు !
X
జాతీయస్థాయిలో ఏపీ‌ మరోసారి అవార్డులను దక్కించుకుంది . తాజాగా కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌ కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌ లో ఏపీకి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వచ్ఛ సుందర్‌ సముదాయక్‌ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్‌ శౌచాలయ అభియాన్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌, దీంతో పాటు గంధగి ముక్త్‌ భారత్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌ లభించింది.

జాతీయ స్థాయిలో ఏపీకి మూడు అవార్డులు రావడం వెనుక సీఎం వైఎస్‌ జగన్‌ కృషి ఎంతో దాగివుందని, ఏపీలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమల్లోకి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలని ఇచ్చింది అని, కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు. సచివాలయ వ్యవస్థతోనే జాతీయ ర్యాంకులు సాధ్యమైన వేళ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కాగా 2014 నుంచి ప్రతి ఏడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్‌ దివస్ ‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను స్వచ్ఛ భారత్‌ దివస్‌ కింద ర్యాంకులను కూడా ప్రకటిస్తారు.