Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం .. షాకైన పోలీసులు

By:  Tupaki Desk   |   18 Sep 2020 2:50 PM GMT
ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం .. షాకైన పోలీసులు
X
ఏపీలో సంపూర్ణ మధ్య పాన నిషేదం వైపు అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వ .. ఆదిశగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో మద్యం ధరలు భారీగా పెంచేశారు. దీనితో అక్రమ మద్యం రవాణా పెరిగిపోయింది. దీనితో ప్రభుత్వం దాన్ని అరికట్టాలని మద్యం ధరల్ని తగ్గించింది. అయితే , అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడంలేదు. పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , పోలిసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అక్రమ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. మద్యం మాఫియా చివరకు ఆర్టీసీ బస్సులను కూడా వదలటం లేదు .

తాజాగా ఆర్టీసీ బస్సులో మద్యం రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు డిపోకు బయలు దేరిన ఏపీ 29జెడ్‌ 0408 ఆర్టీసీ పార్శిల్‌ బస్సులో గురువారం బెంజిసర్కిల్‌ వద్ద మద్యం అట్టపెట్టెలను దించుతున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. బస్సులో నుంచి దించిన అట్టపెట్టల్లో మద్యం బాటిళ్లను గుర్తించారు. తెలంగాణ నుంచి ఏకంగా 2198 మద్యం సీసాలను విజయవాడ, ఏలూరుకు తీసుకొస్తూ దొరికిపోయారు. బస్సు డ్రైవర్లు తోట నాగరాజు, గమిడి నాగరాజు, మెకానిక్‌ ఎం.శ్రీనివాసరావుతో పాటు పార్శిల్స్‌ను తీసుకుంటున్న విజయవాడకు చెందిన కె.సుబ్రహ్మణ్యం, కె.అప్పల నాయుడులను అదుపులోకి తీసుకున్నారు.

ఇక , పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యం విలువ రూ.11.3 లక్షలుగా నిర్ధారించారు. మద్యాన్ని హైదరాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి కాకుండా బయట పెట్టెల్లో పెట్టి ఎక్కించారు. ఆర్టీసీ బస్సు ఏపీది కావడంతో కొవ్వూరు డిపోకు సమాచారం అందించారు.. వేరే డ్రైవర్‌ సాయంతో అక్కడకు బస్సును పంపారు. మద్యం సరఫరా చేసే ముఠా గుట్టురట్టు చేసేందుకు దర్యాప్తు ప్రారంభించారు.