Begin typing your search above and press return to search.
జీతాలు, పెన్షన్ల కోసం ఏపీ అప్పుల తిప్పలు!
By: Tupaki Desk | 28 Aug 2020 2:00 PM ISTరాజధాని కూడా లేని రాష్ట్రం.. అప్పటికే చంద్రబాబు అమరావతి, సంక్షేమం పేరిట 2 లక్షల కోట్లు అప్పు చేసి కుప్ప పెట్టాడు. ఇక జగన్ సర్కార్ రాగానే నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు వండి వార్చింది. ఇంకేముంది.. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అప్పులతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితికి వచ్చింది.
నెలా నెలా కానకష్టంగా మారిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్లు, తదితరాల కోసం అప్పు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొద్దిమంది మంత్రుల సంతకాలతో ఆర్డినెన్స్ దస్త్రాన్ని గవర్నర్ కు పంపినట్లు ప్రచారం సాగుతోంది.
కొత్తగా అప్పు పుట్టాలంటే.. ఎక్కువగా తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3శాతం నుంచి 5 శాతంకు పెంచుతూ చట్ట సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ అప్పుతో వీటన్నింటిని వెళ్లదీయాలని చూస్తోంది.
కేంద్రం అనుమతితో ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3శాతం అప్పు తీసుకునే వీలుంటుంది. దాన్ని 5శాతానికి పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా అప్పులతో ప్రస్తుతం జీతాలు, పెన్షన్లు వెల్లదీయాలని చూస్తోంది.
నెలా నెలా కానకష్టంగా మారిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్లు, తదితరాల కోసం అప్పు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొద్దిమంది మంత్రుల సంతకాలతో ఆర్డినెన్స్ దస్త్రాన్ని గవర్నర్ కు పంపినట్లు ప్రచారం సాగుతోంది.
కొత్తగా అప్పు పుట్టాలంటే.. ఎక్కువగా తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3శాతం నుంచి 5 శాతంకు పెంచుతూ చట్ట సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ అప్పుతో వీటన్నింటిని వెళ్లదీయాలని చూస్తోంది.
కేంద్రం అనుమతితో ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3శాతం అప్పు తీసుకునే వీలుంటుంది. దాన్ని 5శాతానికి పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా అప్పులతో ప్రస్తుతం జీతాలు, పెన్షన్లు వెల్లదీయాలని చూస్తోంది.
