Begin typing your search above and press return to search.

సజ్జలతో చర్చలు విఫలం: జగన్ తోనే తేల్చుకుంటామన్న ఉద్యోగ సంఘాలు

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 PM GMT
సజ్జలతో చర్చలు విఫలం:  జగన్ తోనే తేల్చుకుంటామన్న ఉద్యోగ సంఘాలు
X
పీఆర్సీ ఫైట్ ఏపీలో యమ రంజుగా సాగుతోంది. ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ, ఫిట్ మెంట్ పై తేల్చినా ఉద్యోగ సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. తాజాగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన చర్చలు ముగిశాయి.

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరామని.. 34శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కూడా కోరుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా రేపు సీఎం ఫిట్ మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని.. రేపు ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 34శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరామని.. ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ రావడం సహజంగా వస్తోందని ఆయన గుర్తు చేశారు.

ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ అంగీకరించమని చెప్పామని.. తమ డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళుతామని సజ్జల హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరామని.. 34శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కూడా కోరుతామని ఆయన చెప్పారు. ఉద్యోగులు కోరుతోన్న విధంగా రేపు సీఎం ఫిట్ మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

సీఎం జగన్ కు సీఎస్ నేతృత్వంలోని కమిటీ సోమవారం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జగన్ మనసులో ఏముంది? ఫిట్ మెంట్ 30శాతమైనా దాటుతుందా? అన్న ఆందోళనలో ఉన్నారు. కేవలం 14శాతం మాత్రమే ఫిట్ మెంట్ సిఫారసు చేసింది సీఎస్ కమిటీ.. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం జగన్ కు సీఎస్ నేతృత్వంలోని కమిటీ సోమవారం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలు సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బాపిరాజు సహా ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై మండిపడుతున్నాయి. కేంద్రప్రభుత్వ స్కేల్ ను కమిటీ అధ్యయనం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఈ కమిటీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రకటించారు.