Begin typing your search above and press return to search.

తండ్రి కి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్‌ !

By:  Tupaki Desk   |   24 Dec 2019 10:49 AM GMT
తండ్రి కి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్‌ !
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వై ఎస్ ఆర్ ఘాట్‌ పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి, సోదరి వైఎస్‌ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైఎస్‌ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగులా ప్రభాకర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి బయల్దేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం 2.00 గంటలకు రాయచోటికి వెళ్లారు. రాయచోటి జూనియర్‌ కళాశాల మైదానం సమీపం లో పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేసారు.ఆ తరువాత రాయచోటి లో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొన్నారు.