Begin typing your search above and press return to search.

ఫైజర్​ వ్యాక్సిన్​ కోసం ఆతృత.. బ్రిటన్​ కు ఇండియన్ల క్యూ

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:00 PM IST
ఫైజర్​ వ్యాక్సిన్​ కోసం ఆతృత.. బ్రిటన్​ కు ఇండియన్ల  క్యూ
X
ఫైజర్​ వ్యాక్సిన్​ను బ్రిటన్​ ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యాక్సిన్​ను వేయించుకోవాలని కొందరు డబ్బున్న భారతీయులు ఉత్సాహపడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టుకొని అయినా సరే బ్రిటన్​ వెళ్లి ఆ వ్యాక్సిన్​ వేయించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ట్రావెల్​ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. బ్రిటన్​ ప్రభుత్వం వ్యాక్సిన్​ను ఆమోదించగానే ట్రావెల్​ ఏజెంట్లకు ఫోన్లు వస్తున్నాయట. వచ్చేవారం నుంచి బ్రిటన్​ లో వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలో భారతీయులు లండన్​ వెళ్లి వ్యాక్సినేషన్​ వేయించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కొన్ని ట్రావెల్​ ఏజెన్సీలు ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. అయితే బ్రిటన్​ ప్రభుత్వం వ్యాక్సిన్​ కోసం వచ్చే విదేశీయుల కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రతి విదేశీయుడు తమ దేశంలో ఐదురోజులపాటు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండాలని అదే రోజు ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​ చేయించుకోవాలని సూచించింది.

ఈ నెల 15 నుంచి ఆ నిబంధన అమల్లోకి రానున్నది. అయితే ఇండియా నుంచి వెళ్లిన వాళ్లకు బ్రిటన్​ లో వ్యాక్సిన్​ వేస్తారా లేదా అన్నవిషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై బ్రిటన్​ విదేశాంగ శాఖ నుంచి ప్రకటన రావాల్సి ఉన్నది. కానీ కొన్ని ట్రావెల్​సంస్థలు మాత్రం ప్యాకేజీల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విమానాయాన సంస్థలు, బ్రిటన్​ హోటళ్లతో చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయంపై ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈవో నిషాంత్ మాట్లాడుతూ.. ‘ఇండియా పాస్ట్​ పోర్ట్​ హోల్డర్స్​ కు బ్రిటన్​ లో వ్యాక్సినేషన్​ ఇస్తారా లేదా అన్న విషయం పై క్లారిటీ లేని మాట వాస్తవమే.

అయితే కచ్చితంగా విదేశీయులకు కూడా వ్యాక్సినేషన్​ అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మేము ఇప్పటికే లండన్​ లోని పలు హోటల్ల నిర్వాహకులతో మాట్లాడాము. బ్రిటన్​ నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే బుకింగ్స్​ మొదలుపెడతాం’ అని చెప్పారు. వ్యాక్సిన్ రెడీ అయిందనగానే జనాలు విదేశానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారంటే కరోనా పై ప్రజల్లో ఎంత భయం ఉందో తెలుస్తోందని అంటున్నారు.