Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో టీకా వ్యతిరేక నిరసనలు...అదుపుతప్పిన పరిస్థితులు

By:  Tupaki Desk   |   22 Sept 2021 2:00 PM IST
ఆస్ట్రేలియాలో టీకా వ్యతిరేక నిరసనలు...అదుపుతప్పిన పరిస్థితులు
X
ఆస్ట్రేలియాలో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.దీంతో నిరసనలకు దిగటం అదికాస్తా హింసాత్మకంగా మారాయి. ఇంతకీ ఎందుకింత వ్యతిరేకత వెల్లువెత్తింది అంటే..ఒక్క డోసైనా వేసుకున్న కార్మికులే పనులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించటంతో కార్మికులు ఆందోళనకు దిగటం అవికాస్తా హింసాత్మకంగా మారాయి. దీంతో నిర్మాణ రంగ పనులు రెండు వారాలపాటు నిలిపివేయిన పరిస్థితి నెలకొంది.

కాగా..దేశంలోని విక్టోరియా, న్యూ సౌత్‌ వేల్స్‌ లలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగతున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కేసుల్ని నియంత్నించే పనిలో పడింది. దీంట్లో భాగంగా నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులు కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నాకే పనికి వెళ్లాలని ఆదేశించింది.ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెల్‌ బోర్న్‌ లో వందలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి గత రెండు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

దీంతో పోలీసులు అడ్డుకోవటానికి శతవిధాలా యత్నిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కార్మికులు మరింతగా రెచ్చిపోయారు. పోలీసుల్ని కూడా లెక్క చేయట్లేదు. దీనితో పోలీసులు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవాటానికి యత్నిస్తున్న క్రమంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితిపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మెల్‌ బోర్న్‌ లో నిర్మాణ రంగ పనులను రెండు వారాలపాటు నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

మెల్‌ బోర్న్‌ సహా పలు నగరాల్లో నిర్మాణ పనులను మంగళవారం నుంచి రెండు వారాల పాటు నిలిపివే యనున్నట్లు ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటిం చింది. అప్పటి నుంచే నిరసన ప్రారంభమైంది. అయితే అధికారులు మాత్రం పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను తగ్గించడంతో పాటు, ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ ఒక డోసు తీసుకున్న వారు అక్టోబర్‌ 5 నుంచి పను లకు రావచ్చని ప్రభుత్వం చెప్పింది. విక్టోరియా స్టేట్‌లో గత 24 గంటల్లో 603 కొత్త కేసులు నమోదయ్యాయి.