Begin typing your search above and press return to search.
మరో ట్విస్ట్ .. డెంటిస్ట్ మానస హత్యకేసులో వెలుగులోకి కీలక అంశాలు !
By: Tupaki Desk | 7 Aug 2021 8:35 PM ISTకేరళ కొచ్చిలో జరిగిన డెంటల్ హౌస్ సర్జన్ మానస హత్య కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసుుల నిందితుడు రాఖిల్ కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూపీ లాగుతున్నారు. మరోవైపు ఈ కేసులో మరొకరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. బీహార్ లోని మంగేర్ జిల్లా ఖప్రతారా ఏరియాకు చెందిన సోను కుమార్ అనే వ్యక్తి రాఖిల్కు తుపాకీ ఇచ్చినట్లు నిర్ధారించారు. బీహార్ పోలీసు సహకారంతో సోను కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని మంగేర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఇక మానసను చంపేసిన రాఖిల్…ఓ ఉబెర్ టాక్సీ డ్రైవర్ సాయంతో కేరళ నుంచి బీహార్ కి వెళ్లినట్లు తేల్చారు. అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొని కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి అని ప్లాన్ వేసుకున్నాడు. ఆ తర్వాత పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి, మానసను తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాఖిల్. దీంతో ఇప్పుడు ఆ ఉబెర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు
కేరళలోని కన్నూరు సమీపంలోని నెల్లికుళ్లిలో ఉన్న ఇందిరా గాంధీ డెంటల్ కాలేజీలో పీవీ మానస హౌస్ సర్జన్ గా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమెకు రాఖిల్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో ద్వారా పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా స్నేహం, అక్కడి నుంచి ప్రేమగా మారింది. రాఖిల్ లవ్ ప్రపోజల్ చేయగా మానస నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కక్షగట్టిన రాఖిల్ ఆమెను వేధించసాగాడు. మొబైల్ వాడొద్దని, ఏ అబ్బాయితోనూ ఛాటింగ్ చేయొద్దంటూ వార్నింగ్లు ఇచ్చేవాడు. దీంతో విసిగిపోయిన మానస తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కన్నూర్ పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇకపై తాను మానస జోలికి వెళ్లనని పోలీసుల ముందు రాఖిల్ ఒప్పుకోవడంతో కేసు పెట్టలేదు. అయినప్పటికీ తనను పోలీస్స్టేషన్ కు లాగిన మానసపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న ఆక్రోశంతో గతవారం తుపాకీతో మానసను కాల్చి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మానసను చంపడానికి స్కెచ్ వేసిన రాఖిల్ తుపాకీ కోసం ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ సాయంతో బీహార్కు వెళ్లాడు. అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొనుగోలు చేసి కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి? అని ప్లాన్ వేసుకున్నాడు. పథకం ప్రకారం పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి మానసను తుపాకీతో కాల్చి చంపేసి.. అదే తుపాకీతో తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇక మానసను చంపేసిన రాఖిల్…ఓ ఉబెర్ టాక్సీ డ్రైవర్ సాయంతో కేరళ నుంచి బీహార్ కి వెళ్లినట్లు తేల్చారు. అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొని కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి అని ప్లాన్ వేసుకున్నాడు. ఆ తర్వాత పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి, మానసను తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాఖిల్. దీంతో ఇప్పుడు ఆ ఉబెర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు
కేరళలోని కన్నూరు సమీపంలోని నెల్లికుళ్లిలో ఉన్న ఇందిరా గాంధీ డెంటల్ కాలేజీలో పీవీ మానస హౌస్ సర్జన్ గా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమెకు రాఖిల్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో ద్వారా పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా స్నేహం, అక్కడి నుంచి ప్రేమగా మారింది. రాఖిల్ లవ్ ప్రపోజల్ చేయగా మానస నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కక్షగట్టిన రాఖిల్ ఆమెను వేధించసాగాడు. మొబైల్ వాడొద్దని, ఏ అబ్బాయితోనూ ఛాటింగ్ చేయొద్దంటూ వార్నింగ్లు ఇచ్చేవాడు. దీంతో విసిగిపోయిన మానస తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కన్నూర్ పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇకపై తాను మానస జోలికి వెళ్లనని పోలీసుల ముందు రాఖిల్ ఒప్పుకోవడంతో కేసు పెట్టలేదు. అయినప్పటికీ తనను పోలీస్స్టేషన్ కు లాగిన మానసపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న ఆక్రోశంతో గతవారం తుపాకీతో మానసను కాల్చి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మానసను చంపడానికి స్కెచ్ వేసిన రాఖిల్ తుపాకీ కోసం ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ సాయంతో బీహార్కు వెళ్లాడు. అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొనుగోలు చేసి కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి? అని ప్లాన్ వేసుకున్నాడు. పథకం ప్రకారం పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి మానసను తుపాకీతో కాల్చి చంపేసి.. అదే తుపాకీతో తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
