Begin typing your search above and press return to search.

ఆమె ఎవరు ? అసలు ఏం జరిగింది..? మిస్టరీగా చెవేళ్ల దిశ ఘటన

By:  Tupaki Desk   |   18 March 2020 7:30 AM GMT
ఆమె ఎవరు ? అసలు ఏం జరిగింది..? మిస్టరీగా చెవేళ్ల దిశ ఘటన
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది దిశ సంఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. వెటర్నరీ డాక్టర్ అయిన దిశని నలుగురు కామాంధులు అతి దారుణంగా రేప్ చేసి , చిత్రహింసలు పెట్టి ..బ్రతికుండగానే పెట్రోల్ పోసి నిప్పుపెట్టేసారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తరువాత దిశ పేరుతొ ఏపీలో మహిళల కోసం కొత్త చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. అయితే , మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేదుకు ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు.

దిశ సంఘటన ఇంకా మన కళ్ళముందు మెదులుతుండగానే ...తాజాగా అలాంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌–వికారాబాద్‌ రహదారి లో చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామశివారులో వెలుగుచూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను అతి కిరాతకంగా హత్యచేసి, మొఖం కూడా గుర్తుపట్టలేని విదంగా రాయి తో తలపై కొట్టారు. ఈ సంఘటన తో మరోసారి తెలుగు రాష్ట్రలు ఉలిక్కి పడ్డాయి. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని కల్వర్టు కింద ఓ మహిళ మృతదేహం నగ్నంగా పడిఉండటంతో ..వెంటనే పోలీసులకి సమాచారం అందించారు.

ఈ సమాచారంతో రంగంలోకి దిగిన శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రేణుకారెడ్డి సిబ్బందితో వివరాలు సేకరించారు. దుండగులు ఎక్కడో మహిళనుచంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో ఆ మహిళా పై లైంగిక దాడి కూడా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు .

ఇకపోతే మృతదేహం పక్కన ఒక తాడు లభించింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని వాహనంలో తీసుకొచ్చి కల్వర్టు పైనుంచి కిందికి దించి పడేసి పోయి ఉంటారనే అనుమానాలు మొదలైయ్యాయి. అలాగే మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, ఆమె వేలికి బంగారు ఉంగరం, మెడలో గోల్డ్‌ లాకెట్‌ ఉన్నాయి. మాములుగా దొంగలు అయితే , మహిళపై దాడి చేసిన తరువాత ఆమె ఒంటిపై ఉండే బంగారాన్ని కూడా తీసుకువెళ్ళేవారు. కానీ, మహిళ శవం పై ఉండే బంగారాన్ని అలాగే వదిలివెళ్లారు అంటే ..పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టివుంటారు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లూస్‌ టీం, పోలిసుల జాగిలాలతో పరిశీలించినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎలాంటి ఘటనలు జరుగుతుండటం గమనార్హం.