Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ లో మరో నిర్భయ ...డేటింగ్ కి వెళ్తే బెదిరించి గ్యాంగ్ రేప్ !

By:  Tupaki Desk   |   8 Jan 2020 6:13 AM GMT
మధ్యప్రదేశ్ లో మరో నిర్భయ ...డేటింగ్ కి వెళ్తే బెదిరించి గ్యాంగ్ రేప్ !
X
ఈ సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది కరువైపోతుంది. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు కామాంధులు. ఆడపిల్ల పై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలని తీసుకువచ్చినా కూడా వారిపై జరిగే అఘాయిత్యాలని మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ లో యువతి దారుణంగా లైంగిక దాడికి గురైంది. 12 తరగతి చదువుతున్న యువతి పై ఇద్దరు కామాంధులు బ్లాక్ మెయిల్ చేసి , గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ దారుణం భోపాల్‌ లోని గోవింద్‌పుర పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకొన్నది

పూర్తి వివరాలని చూస్తే .. ఒక అమ్మాయి తన లవర్ తో కలిసి మారుమూల ప్రాంతానికి డేటింగ్‌కు వెళ్లింది. వారిద్దరు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకొంటుండగా , ఒక్క సారిగా ఇద్దరు వారిపై కర్రలతో దాడి చేశారు. ఆ తరువాత ఆ ఇద్దరిని వివస్త్రలుగా చేసి ఫోటోలు తీయడంతోపాటు వీడియోను కూడా చిత్రీకరించారు. వారిని తమ చేష్టలతో వేధించారు. చివరకు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. రూ.5 వేలు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేస్తామని, కుటుంబ సభ్యులకు కూడా పంపిస్తామని బెదిరించారు. దీనితో ఆ అమ్మాయిని అక్కడే వదిలి 5 వేలు తెచ్చేందుకు స్కూటర్‌ పై వెళ్ళాడు.

ఆ తరువాత కాసేపటికే అక్కడికి తిరిగి వచ్చే సమయానికి ఘోరం జరిగి పోయింది. ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్లిపోవడం తో అదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆ అమ్మాయి పై అఘాయిత్యం చేసారు. డబ్బులు తీసుకోని వచ్చే సరికి ఆ అమ్మాయి ఏడుస్తూ కనిపించడంతో ఓదార్చుతూ విషయం అడుగగా.. ఇద్దరు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ప్రియుడికి యువతి తెలిపింది. దాంతో షాక్ తిన్న ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొంచెం సేపు ఆలోచించినా, ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకొని తనకు 5వేలు ఇచ్చిన స్నేహితుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిలో ఒకరు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రాంబాబు సూర్యవంశీగా, మరో వ్యక్తి స్థానికుడు రాకేష్ రాజ్‌పుత్ గా గుర్తించారు. వీరిద్దరిపై అత్యాచారం కేసుతోపాటు కిడ్నాప్, దోపిడి కేసును కూడా నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.