Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు మ‌తిపోయిందిః ఎమ్మెల్యే అనిల్‌

By:  Tupaki Desk   |   30 Jun 2017 10:04 AM GMT
చంద్ర‌బాబుకు మ‌తిపోయిందిః ఎమ్మెల్యే అనిల్‌
X
సీఎం చంద్రబాబు నాయుడుకు మతితప్పిందని నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నోబెల్ బ‌హుమ‌తి ఎవ‌రికిస్తారో కూడా తెలియ‌కుండా సీఎం స్థాయి వ్య‌క్తి మాట్లాడ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. నెల్లూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో మెడల్ సంపాదిస్తే నోబెల్ బహుమతి ఇప్పిస్తాననడం విడ్డూరంగా ఉంద‌న్నారు. సీఎం స్థాయి వ్యక్తికి నోబెల్ బహుమతి ఎందుకిస్తారో తెలియకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ముఖ్యమంత్రి అవగాహన లేని మాటలు చూస్తుంటే ఆయన మానసికస్థితి బాగాలేదని అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.

కాగా, గ‌తంలోనూ ఓ సారి నోబెల్‌ పై నోరుజారిన‌ చంద్రబాబుపై ఏ రేంజ్‌ లో సెటైర్లు పేలాయో తెలిసిందే. ఇప్పుడు బాబుగారు మరో అడుగుముందుకేసి.. ఒలింపిక్స్‌లో గెలిచినవాళ్లకు నోబెల్‌ ఇస్తాననడం విడ్డూరంగా ఉంది. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు - లోకేష్‌ ల‌పై సెటైర్లు వేస్తున్నారు.

‘శాంతి - సాహిత్యం - సైన్స్‌ రంగాల నిపుణులకు మాత్రమే అందించే నోబెల్‌ పురస్కారాన్ని. క్రీడాకారులకు కూడా నోబెల్‌ ఇస్తానంటున్న బాబును ఏమనాలి?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘బాబుగారిని జలీల్‌ ఖాన్‌ కు అన్నయ్య అందామంటే ఆల్రెడీ లోకేశ్‌ ఉన్నారు. కాబట్టి తాతని అనొచ్చేమో!’ అని మ‌రొక‌రు కామెంట్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/