Begin typing your search above and press return to search.

ఆర్మీకి హానిట్రాప్ ..ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   8 Nov 2019 9:46 AM GMT
ఆర్మీకి హానిట్రాప్ ..ఏంచేశారంటే ?
X
సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చేస్తున్న ఘోరాలని మనం రోజు చూస్తూనే ఉన్నాం. ప్రపంచం లో జరిగే చాల వరకు దారుణాలు సోషల్ మీడియా కారణం గానే జరుగుతున్నాయి. వారు ట్రాప్ చేయాలనీ భావించినవారితో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వారిని ఈజీగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ని ఉపయోగించుకొని పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ జవాన్లని ట్రాప్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల పేరుతొ పరిచయమై .. ఆర్మీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్విభజనను జీర్ణించుకో లేకపోతోనున్న పాకిస్థాన్.. తనకు అనుకూలంగా ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు.

భారత ఆర్మీ రహస్యాలు దొంగిలించడానికి అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికులపైకి అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది. కానీ , అమ్మాయిలకి కూడా లొంగని వారిని.. భక్తి ముసుగులో బాబాలుగా నమ్మించి ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తోంది. పాక్ వేసే ఈ కుట్రలని సోషల్ మీడియా ద్వారానే అమలుచేస్తుంది. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. ట్రాప్ చేస్తోంది. జవాన్లు మాయలో పడిపోయాక.. సైనిక, ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువ కావడంతో భారత ఆర్మీ దీనిపై అప్రమత్తం అయింది. భారత్ ఆర్మీ మన జవాన్లకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ జారీ చేసింది.

ఇక, తాజాగా రాజస్థాన్‌ లో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ ఆర్మీ హనీట్రాప్‌ లో పడగా.. లాన్స్‌ నాయక్ రవి వర్మ, సిపాయి విచిత్ర బెహెరా పాక్ ఇంటెలిజెన్స్‌ వలలో చిక్కారని గుర్తించి రాజస్థాన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.. ఇప్పటికే హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ.. వారిని పట్టుకోగలిగింది. సీరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫొటోతో వాళ్లని లోబరుచుకుని ఆర్మీ రహస్యాలను దొంగిలించే ప్రయత్నం చేసినట్లు ఇండియన్ ఆర్తీ కనుగొన్నది. మరోవైపు పాక్ కుట్రలను పసిగట్టిన భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ మన జవాన్లను అప్రమత్తం చేసింది. అలాగే బాబాలమంటూ, ఆధ్యాత్మిక గురువులమంటూ కూడా ట్రాప్ చేసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సైనికులని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది.