Begin typing your search above and press return to search.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఉద్యోగి !

By:  Tupaki Desk   |   23 Oct 2020 1:30 AM GMT
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఉద్యోగి !
X
గత కొన్ని రోజుల ముందు వరకు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చి సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అందరూ సేదతీరేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు ఆఫీసులు బంద్ అయిపోయి వర్క్ ఫ్రం హోం వచ్చేసింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఆఫీస్ టెన్షన్ అంతా ఇంట్లో పీక్స్ లో ఉంటోంది. ఆ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌ లోని అదాజన్ ‌కు చెందిన జిగర్‌ గాంధీ అనే వ్యక్తి నోయిడాలోని ఓ కంపెనీలో గత మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. దాదాపు రెండు నెలల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్నాడు.

ఈ ఒత్తిడి గురించి కుటుంబసభ్యులతో కూడా చర్చించాడు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై అదాజన్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గత డిసెంబర్‌లో అతడి ఎంగేజ్‌ మెంట్‌ రద్దయింది. ఇక అప్పటినుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. దానికి తోడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడి కూడా మొదలైంది. అతడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తుల్ని ఆత్మహత్యకు ముందు రోజు ఇంటికి పిలిపించుకుని ఆ రాత్రంతా వారితో సరదాగా గడుపుదామనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.