Begin typing your search above and press return to search.
బాబు ఆరోగ్యానికి ఏమైంది..ఎందుకు ఇలాంటి మాటలు?
By: Tupaki Desk | 2 May 2018 4:45 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్మీడియాలో జోకులు పేలుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలని పేర్కొన్నారు. `బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ అని గొప్పగా చెప్పారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి - సత్యా నాదెండ్ల - పివి సింధు తనవల్లే ప్రతిభ కనపరిచారని, 400 సంవత్సరాల హైదరాబాద్ ను నేనే నిర్మించానని - సెల్ ఫోన్ ను నేనే తీసుకుని వచ్చానని - స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించారంటే ఆయన మానసిక పరిస్థితిని ఒకసారి విశ్లేషించుకోవాల్సి ఉంది` అని అంబటి అన్నారు.
పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి ఆయనకేం తెలియనది ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని దొంగింలించిన బాబుఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించవద్దని కోరారు. బ్రిటిషు వారితో తాము పోరాడామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు - ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే రీతిన పోరాడినట్లుగా భావించాల్సి ఉందన్నారు. నిజంగా చంద్రబాబు ఆరోజు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఉంటే, గాంధీజీ కూడా మనం ఇక్కడ ఇండియాలో కాదు పోరాటం చేయాల్సింది, ఇంగ్లండ్ లో పోరాటం చెయ్యాలంటూ సూచించేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో నిరనసనలు చేయాలంటూ బాబు చేసిన వ్యాఖ్యలనుద్దేశించి అంబటి ఈ కామెంట్లు చేశారు. ఆరు బయట పడిన వర్షం కంటే భవనాల్లోనే ఎక్కువ వర్షం కురిసే టెక్నాలజీ చంద్రబాబు సొంతమని అంబటి ఎద్దేవా చేశారు. `బాబు టెక్నాలజీ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, బయట 3 సెం.మీ.ల వర్షం పడితే, ప్రతిపక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లో అంతకు రెట్టింపుగా 6 సెం. మీ. వర్షం పడింది. ఇంత మంచి సింగపూర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు` అంటూ అంబటి ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో తామేదో చేశామంటూ చెప్పుకోడానికి చంద్రబాబు తెగ ఆరాట పడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తనపై కేసులు, విచారణ జరుగుతుందన్న భయంతో, అటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తిరుపతిలో సభను నిర్వహించినట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 2016 తరువాత ప్రత్యేక ప్యాకేజీ గొప్ప తనం వివరించమని చెపుతూ పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా, టీడీపీ శిక్షణ శిబిరాల్లో కూడా హోదా వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని వివరించమని చెప్పిన మాటను మరచిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు ఉపన్యాసం హోదా మా హక్కు అని నినదించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని, ఇవాల్టికి కూడా వాటిని ఎదుర్కుంటున్నామన్నారు. వారిపై పెట్టిన కేసులను ఎందుకు ఎత్తి వేయలేదని ప్రశ్నించారు. ఈ రోజు ప్రత్యేక హోదా అంటూ నినదిస్తున్న చంద్రబాబు నాయుడు, హోదా కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని ఎందుకు చూశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకమ్మ కబుర్లు, అబద్దాలతో ప్రజలను మోసం చేసే యత్నం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. తిరుపతి సభలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తారని అందరూ అనుకున్నారని అయితే బాబు నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదన్నారు. ఇదంతా కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నట్లుగా భావించాల్సివస్తోందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారుని, తనపై కేసులు పెడతారని ఆయన అనుకుంటున్నారనే ఆందోళనతోనే తిరుపతిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తనపై కేసులు పెట్టవద్దంటూ కేంద్రంపై వత్తిడి పెంచే యత్నం చేశారన్నారు. ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు లేవంటూ రాజీపడే ధోరణిని వ్యక్తం చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమంటూ చెప్పుకునే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.
పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి ఆయనకేం తెలియనది ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని దొంగింలించిన బాబుఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించవద్దని కోరారు. బ్రిటిషు వారితో తాము పోరాడామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు - ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే రీతిన పోరాడినట్లుగా భావించాల్సి ఉందన్నారు. నిజంగా చంద్రబాబు ఆరోజు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఉంటే, గాంధీజీ కూడా మనం ఇక్కడ ఇండియాలో కాదు పోరాటం చేయాల్సింది, ఇంగ్లండ్ లో పోరాటం చెయ్యాలంటూ సూచించేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో నిరనసనలు చేయాలంటూ బాబు చేసిన వ్యాఖ్యలనుద్దేశించి అంబటి ఈ కామెంట్లు చేశారు. ఆరు బయట పడిన వర్షం కంటే భవనాల్లోనే ఎక్కువ వర్షం కురిసే టెక్నాలజీ చంద్రబాబు సొంతమని అంబటి ఎద్దేవా చేశారు. `బాబు టెక్నాలజీ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, బయట 3 సెం.మీ.ల వర్షం పడితే, ప్రతిపక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లో అంతకు రెట్టింపుగా 6 సెం. మీ. వర్షం పడింది. ఇంత మంచి సింగపూర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు` అంటూ అంబటి ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో తామేదో చేశామంటూ చెప్పుకోడానికి చంద్రబాబు తెగ ఆరాట పడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తనపై కేసులు, విచారణ జరుగుతుందన్న భయంతో, అటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తిరుపతిలో సభను నిర్వహించినట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 2016 తరువాత ప్రత్యేక ప్యాకేజీ గొప్ప తనం వివరించమని చెపుతూ పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా, టీడీపీ శిక్షణ శిబిరాల్లో కూడా హోదా వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని వివరించమని చెప్పిన మాటను మరచిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు ఉపన్యాసం హోదా మా హక్కు అని నినదించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని, ఇవాల్టికి కూడా వాటిని ఎదుర్కుంటున్నామన్నారు. వారిపై పెట్టిన కేసులను ఎందుకు ఎత్తి వేయలేదని ప్రశ్నించారు. ఈ రోజు ప్రత్యేక హోదా అంటూ నినదిస్తున్న చంద్రబాబు నాయుడు, హోదా కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని ఎందుకు చూశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకమ్మ కబుర్లు, అబద్దాలతో ప్రజలను మోసం చేసే యత్నం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. తిరుపతి సభలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తారని అందరూ అనుకున్నారని అయితే బాబు నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదన్నారు. ఇదంతా కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నట్లుగా భావించాల్సివస్తోందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారుని, తనపై కేసులు పెడతారని ఆయన అనుకుంటున్నారనే ఆందోళనతోనే తిరుపతిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తనపై కేసులు పెట్టవద్దంటూ కేంద్రంపై వత్తిడి పెంచే యత్నం చేశారన్నారు. ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు లేవంటూ రాజీపడే ధోరణిని వ్యక్తం చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమంటూ చెప్పుకునే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.
