Begin typing your search above and press return to search.

అమరావతి కేసులపై మళ్లీ మొదటి నుంచి విచారణ

By:  Tupaki Desk   |   26 March 2021 5:00 PM IST
అమరావతి కేసులపై మళ్లీ మొదటి నుంచి విచారణ
X
అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని రైతులు, ఇతరులు వేసిన పిటీషన్ పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. పిటీషన్లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్ లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసానం విచారణ చేపట్టింది. అయితే ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. కొత్త చీఫ్ జస్టిస్ రావడంతో మళ్లీ మొదలటి నుంచి విచారణ చేపడుతున్నారు.

రాజధాని భూములకు సంబంధించిన కేసుపై ఎప్పుడు విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలనే అంశంపై శుక్రవారం ప్రభుత్వం తరుఫు నుంచి అడ్వకేట్ జనరల్, ఇటు రైతుల తరుఫున వాదించే న్యాయవాదులతో చర్చించారు. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ బదిలీ దృష్ట్యా కొత్త త్రిసభ్య ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్ధమైంది. ఈ కేసు విచారణ రెండు, మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.