Begin typing your search above and press return to search.

టాటా సన్స్‌ చేతుల్లోకి ఎయిర్ ఇండియా .. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే

By:  Tupaki Desk   |   9 Oct 2021 6:35 AM GMT
టాటా సన్స్‌ చేతుల్లోకి ఎయిర్ ఇండియా .. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే
X
ఎయిర్ ఇండియా టాటాను తిరిగి దక్కించుకున్న సమయంలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. నాడు నెహ్రూ ప్రభుత్వం ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పుడు టాటాకు కేవలం రూ .2.8 కోట్లు ఇచ్చింది. జవహర్‌ లాల్ నెహ్రూ ప్రభుత్వం 1953 లో జాతీయం చేయడం ద్వారా ఎయిర్ ఇండియాను టాటా నుంచి స్వాధీనం చేసుకుంది. 1953 లో ఎయిర్ ఇండియా జాతీయం చేసినప్పటికీ జేఆర్‌డీ టాటా 25 సంవత్సరాలకు పైగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌ గా కొనసాగారు. ఏడు దశాబ్దాల పాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్‌ పరమైంది.

అప్పట్లో కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్‌ కు రూ .2.8 కోట్లు చెల్లించి వెంచర్‌లో 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిర్‌ లైన్స్‌ ను రూ.18,000 కోట్లకు టాటా సన్స్‌ దక్కించుకుంది.1932 లో జెఆర్‌డి టాటా స్థాపించిన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే ప్రయత్నంలో టాటా గ్రూప్ విజయం సాధించినట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఎయిర్ ఇండియా యొక్క ఘర్ వాపసీ రతన్ టాటా 89 వ పుట్టినరోజు అక్టోబర్ 15 కి కేవలం వారం రోజుల ముందు సర్కారు తెలిపింది.

ఎయిర్ లైన్ బిడ్ తర్వాత రతన్ టాటా నాటి జేఆర్డీ టాటా పాత చిత్రాన్ని పంచుకున్నారు. తిరిగి ఎయిర్ ఇండియాకు స్వాగతం అంటూ నాటి చిత్రాన్ని ట్వీట్ చేశారు.విమాన యానంపై ఆసక్తి ఉన్న జేఆర్డీ టాటా 1929లో ఫ్లయింగ్ క్లబ్ ప్రారంభమైనపుడు విమానాలు నడపడంలో నైపుణ్యం సాధించారు. మూడు సంవత్సరాల తరువాత జేఆర్డీ టాటా 1932 లో రూ .2 లక్షల పెట్టుబడితో టాటా ఏవియేషన్ సర్వీసును స్థాపించారు.

జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియా యొక్క మొదటి విమాన పైలట్ అయ్యారు. ఆ తర్వాత టాటా ఎయిర్ మెయిల్ అని పిలిచారు.అప్పట్లో కార్గో ఫ్లైట్ త్వరలోనే లాభాలను ఆర్జించే వెంచర్‌గా మారింది. ఐదేళ్లలో టాటా ఎయిర్ మెయిల్ లాభం 1933 లో రూ. 60,000 నుంచి 1937 లో రూ. 6 లక్షలకు పెరిగింది.1938 లో టాటా పేరును టాటా ఎయిర్‌ లైన్స్‌ గా మార్చారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు టాటా ఎయిర్‌ లైన్స్ వద్ద ఉన్న అన్ని విమానాలను ప్రభుత్వానికి అప్పగించింది. అంతకు ముందు ఎయిర్‌లైన్స్ వ్యాపారం నడపడంలో టాటా ప్రభుత్వానికి సమస్యలు తలెత్తాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత టాటా విమానాల నియంత్రణను తిరిగి పొందారు. జేఆర్డీ టాటా 1946 లో ఎయిర్‌ లైన్స్‌ ను ఎయిర్ ఇండియాగా పేరు మార్చి, జాయింట్-స్టాక్ కంపెనీగా ప్రజల్లోకి వెళ్లారు.

మరుసటి సంవత్సరం ఎయిర్ ఇండియా తన తొలి అంతర్జాతీయ ప్రయానాన్ని బాంబే-లండన్ విమాన సర్వీసుతో ప్రారంభించింది. ఎయిర్ ఇండియా యొక్క మొట్టమొదటి బోయింగ్ 747 విమానం 1978 జనవరి 1న ముంబైలోని అరేబియా సముద్రంలో మునిగి 213 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. దీంతో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం జేఆర్డీ టాటాను ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. 1980 లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జేఆర్డీ టాటాను ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డుకు తిరిగి తీసుకువచ్చారు.