Begin typing your search above and press return to search.

ఏఐసీసీ అంటే... ఆలిండియా క్రైసిస్‌ కమిటీ : కేటీఆర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   8 May 2022 1:29 AM GMT
ఏఐసీసీ అంటే... ఆలిండియా క్రైసిస్‌ కమిటీ : కేటీఆర్ ఫైర్‌
X
''ఏఐసీసీ అంటే... ఆలిండియా క్రైసిస్‌ కమిటీ'' అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2018లో చెప్పిన విషయాలనే వ‌రంగ‌ల్‌ సభలో చెప్పారని విమర్శించారు.

తెలంగాణ తామే ఇచ్చామని చెప్తున్నారని.. కానీ ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది.. రాహుల్‌ తాత నెహ్రూ కాదా అంటూ మంత్రి కేటీఆర్ నిలదీశారు. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతూనే ఉన్నారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. అరవై ఏళ్లు పోరాడి ప్రజలు మళ్లీ తెలంగాణ సాధించుకున్నారని.. రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది తామేనని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ధాన్యం గురించి పార్లమెంటులో రాహుల్‌గాంధీ ఎప్పుడైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయలేదని అవాస్తవాలు మాట్లాడారని.. రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.17 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్‌ మాటలను ఎవరూ విశ్వసించవద్దని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్ డిక్లరేషన్ ఓ పాత చింత కాయ పచ్చడి ఆయన విమర్శించారు

''దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా.. కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని కేటీఆర్ అన్నారు. ఒక ఎంపీగా గెలవని రాహుల్ గాంధీ(యూపీలో వ‌దిలేసి.. కేర‌ళ‌లో గెలిచారు) ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాహుల్‌.. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారంటూ విమర్శల వర్షం గుప్పించారు.

దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా.. పొత్తు కావాలని కాంగ్రెస్‌ను ఎవరైనా అడిగారా? అంటూ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్‌గాంధీ చదివారన్నారు. వ్యవసాయాన్ని జాతర చేసింది టీఆర్ ఎస్‌ సర్కారేనని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందని మంత్రి వెల్లడించారు.

వ‌రంగ‌ల్‌ పై కేటీఆర్ వ‌రాల జ‌ల్లు

దేశానికే తలమానికంగా నిలిచేలా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్లోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో రెండేళ్లల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని... దీంతో 20 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా నిలిచేలా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు జరుగుతోందని.. కార్యాలయాల ఏర్పాటుకు మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాల్లోనే 50 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పల్లెలకు, పట్టణాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.