Begin typing your search above and press return to search.

దారుణం : కరోనా లేదు , భయంతో జేసీబీతో అంత్యక్రియలు !

By:  Tupaki Desk   |   23 July 2020 9:30 AM GMT
దారుణం : కరోనా లేదు , భయంతో జేసీబీతో అంత్యక్రియలు !
X
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి మనుషులలో ఉండే మానవత్వాన్ని చంపేస్తుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను అత్యంత దారుణంగా ఖననం చేస్తున్నారు. కరోనా వచ్చి మరణించిన వారి మృతదేహాలని జేసీబీల్లో తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుతున్న ఘటనలు ఈ మధ్య చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. కరోనా లేకపోయిన ఓ యువకుడి మృత దేహాన్నిఆ గ్రామ సర్పంచ్ జేసీబీ తో ఖననం చేయించారు.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... తాజాగా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు కన్నుమూశాడు. అతడికి కరోనా నిర్ధారణ కాకపోయినప్పటికీ, ఉండొచ్చేమోనన్న అనుమానంతో సర్పంచ్ అంత్యక్రియలకు అడ్డు చెప్పాడు. జేసీబీతో డెడ్ బాడీని తరలించి, ఖననం చేయాలని ఆదేశించాడు. కరోనా పేషెంట్ మృతదేహానికి చేసినట్టుగానే జేసీబీతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాడు. అంత్యక్రియలు చేసేందుకు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే , అది కూడా పీపీఈ కిట్లు వేసుకొనే వెళ్లాలని స్పష్టం చేశాడు. దీంతో గ్రామ సిబ్బంది అలాగే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో సర్పంచ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా రాకుండా జాగ్రత్త పడటం మంచిదే కానీ , ఇంత ముందు జాగ్రత్త పనికిరాద అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.