Begin typing your search above and press return to search.

భర్తకు దూరంగా ఉంటున్న మహిళకు వల.. ఒప్పుకోకపోవడంతో ఇలా..

By:  Tupaki Desk   |   5 July 2021 7:43 AM GMT
భర్తకు దూరంగా ఉంటున్న మహిళకు వల.. ఒప్పుకోకపోవడంతో ఇలా..
X
అందంగా ఉంటుంది.. పైగా సొంతంగా వ్యాపారం చేస్తోంది. భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె అందచందాలకు ఆకర్షితులు అయిన ఓ ఆస్పత్రి సీఈవో కం డాక్టర్ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు.అప్పటికే అతడికి విడాకులు అయ్యి ఒక కొడుకు ఉన్నాడు. ఆయనకు నో చెప్పింది ఆ మహిళ. దీంతో పగ పెంచుకున్న ఆ సీఈవో ఆమెను గంజాయి కేసులో ఇరికించాడు. ట్విస్ట్ ఏంటంటే.. దీనికోసం పెద్ద స్కెచ్ వేసి చివరకు దొరికిపోయాడు.

శోభా విశ్వనాథ్ అనే యువతి భర్తకు విడాకులు ఇచ్చి విడిగా ఉంటోంది. కేరళకు చెందిన ఈ 30 ఏళ్ల యువతి గత పదేళ్లుగా తిరువనంతపురంలో ఒక దుస్తుల దుకాణం పెట్టుకొని జీవిస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోయి విడాకులు కేసు పెట్టింది. కోర్టులో ఆ కేసు నడుస్తుండగా.. ఈ అందమైన మహిళను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బట్టల దుకాణంలో గంజాయి పొట్లాలు కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే విచారణలో ఆమె ఆ పొట్లాలు తాను పెట్టలేదని స్పష్టం చేసింది. బట్టల దుకాణం సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా.. అంతకుముందు రోజు అనుమానాస్పదంగా షాపులో కనిపించిన పనిమనిషిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ‘వివేక్ అనే యువకుడు’ తనను ఇలాచేయాలని చెప్పాడని పనిమనిషి చెప్పింది. వివేక్ గతంలో ఇదే షాపులో పనిచేసి డబ్బులు గోల్ మాల్ చేశాడు. శోభ అతడిని తొలగించింది.

వివేక్ ను పట్టుకొని విచారించగా.. తనను లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ ఈ గంజాయి పొట్లాలు పెట్టించాలని చెప్పాడని పోలీసులకు తెలిపాడు. ఎందుకని ఆరాతీయగా.. ‘శోభను హరిదాస్ పెళ్లి చేసుకోవాలని అడిగాడని.. ఆమె ఒప్పుకోకపోవడంతో కక్ష పెట్టుకొని ఆమెను గంజాయి కేసులో ఇరికించాడని’ తేలింది.

దీంతో వివేక్ ను అరెస్ట్ చేసి అసలు సూత్రదారి డాక్టర్ హరిదాస్ కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. అతడిప్పుడు పరారీలో ఉన్నాడు.ఇలా అందమైన మహిళను పెళ్లి చేసుకోవాలని ఆమెను కేసులో ఇరికించిన డాక్టర్ వ్యవహారం చర్చనీయాంశమైంది.