Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు చరిత్రలో అద్భుత ఘట్టం

By:  Tupaki Desk   |   31 Aug 2021 2:01 PM IST
సుప్రీంకోర్టు చరిత్రలో అద్భుత ఘట్టం
X
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. మొదటిసారి ఒకేసారి 9మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంచెం సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయమూర్తుల చేత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా ప్రభావం వల్ల ఒకటో నంబర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయ ఆడిటోరియానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్పు చేశారు. ఈ ఘట్టాన్ని మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక చరిత్రగా నిలిచింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి ప్రత్యక్ష ప్రసారమైన జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కావడం గమనార్హం.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వెంకటరామయ్య, నాగరత్న, జస్టిస్ చుడలయిల్ తేవన్ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘఠం నర్సింహ లు తాజాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆగస్టు 17న తొమ్మిది పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు చేసిన సిఫార్సులను ఆగస్టు 26న రాష్ట్ర పతి ఆమోదించారు.

ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరిగింది.