Begin typing your search above and press return to search.
హైదరాబాద్లో నాళాకు మరొకరు బలి : 11 రోజుల తర్వాత దొరికిన శవం !
By: Tupaki Desk | 5 Oct 2021 10:00 PM ISTహైదరాబాద్, మణికొండలో రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాళాలో గల్లంతై చెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో విషాదమైంది. తాజాగా బుధవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు. ఈ నెల 25న జరిగిన ప్రమాదం విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కుత్భుల్లాపూర్లోని గణేశ్ టవర్స్లో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి 25 రాత్రి స్థానిక రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయల్దేరే సమయంలో భారీ వర్షం కురవడంతో స్నేహితులు ఇద్దరూ పక్కనే ఆగారు. మోహన్ రెడ్డి పక్కకు వెళ్లి సిగరేట్ తాగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ నాళాలో పడిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ నాళాలో కొట్టుకుపోయాడు.
అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గణేశ్ టవర్స్లో నివాసముండే మెహన్ రెడ్డి, గత నెల 25న స్నేహితలతో కలిసి వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం ఇంటికి బయల్దేరారు. భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన ఆగారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆయన నాలాలో పడినట్లు సీసీ ఫుటెజ్ ద్వారా గుర్తించారు. అ
ప్పటి నుంచి జీహెచ్ ఎంసీ, డీఆర్ ఎఫ్ బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా, ఈ రోజు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పిలిచగా అది మోహన్ రెడ్డి శవంగా నిర్ధరించారు.
అదే రోజు హైదరాబాద్ మణికొండలో గోపిశెట్టి రజినీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. అతడి మృతదేహం రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో లభించింది. అయితే అదే మోహన్ రెడ్డి నాలాలో పడ్డారు. కానీ ఎవరు గుర్తించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటెజ్ పరిశీలిస్తే అతడు నాలాల పడినట్లు గుర్తించారు. అప్పటి నుంచి గాలిస్తుండగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.
అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గణేశ్ టవర్స్లో నివాసముండే మెహన్ రెడ్డి, గత నెల 25న స్నేహితలతో కలిసి వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం ఇంటికి బయల్దేరారు. భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన ఆగారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆయన నాలాలో పడినట్లు సీసీ ఫుటెజ్ ద్వారా గుర్తించారు. అ
ప్పటి నుంచి జీహెచ్ ఎంసీ, డీఆర్ ఎఫ్ బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా, ఈ రోజు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పిలిచగా అది మోహన్ రెడ్డి శవంగా నిర్ధరించారు.
అదే రోజు హైదరాబాద్ మణికొండలో గోపిశెట్టి రజినీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. అతడి మృతదేహం రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో లభించింది. అయితే అదే మోహన్ రెడ్డి నాలాలో పడ్డారు. కానీ ఎవరు గుర్తించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటెజ్ పరిశీలిస్తే అతడు నాలాల పడినట్లు గుర్తించారు. అప్పటి నుంచి గాలిస్తుండగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.
