Begin typing your search above and press return to search.

పొలంలోనే కత్తితో పొడుచుకున్న రైతు.. ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారని ఆరోపణ

By:  Tupaki Desk   |   22 Dec 2020 1:50 PM GMT
పొలంలోనే కత్తితో పొడుచుకున్న రైతు.. ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారని ఆరోపణ
X
ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారని, పొలంలోనే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు ఓ రైతు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రులో జరిగింది.

పొలం వివాదంలో వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అనుచరులు తనను మోసం చేశారంటూ రైతు సలీం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం ఉదయం నుంచి తాను కౌలు చేస్తున్న పొలంలో కుర్చీ వేసుకుని కూర్చుని దీక్ష చేపట్టాడు సలీం. ఈ పొలం విషయంలో గత కొంత కాలంగా వివాదం నడస్తూనే ఉంది. సలీం దీక్ష విషయం తెలుసుకున్న పోలీసులు.. పొలం వద్దకు చేరుకున్నారు. వారు ఆందోళన విరమించాలని కోరగా.. తనకు ఎవ్వరూ న్యాయం చేయట్లేదని అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడుచుకుని సలీం ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. సలీం ఆత్మహత్యాయత్నం స్థానికంగా సంచలనం సృష్టించింది.