Begin typing your search above and press return to search.

హోంమంత్రి మనవడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!?

By:  Tupaki Desk   |   7 March 2021 10:36 AM GMT
హోంమంత్రి మనవడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!?
X
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడిపై పంజాగుట్ట పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. అతడు ర్యాగింగ్ చేస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నాడని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

తాజాగా ఫరాన్ తమను ర్యాగింగ్ చేస్తున్నాడని అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి రియాన్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అనంతరం రియాన్ అనే విద్యార్థి మీడియాతో మాట్లాడాడు. తన చేతికి అయిన గాయాలను రియాన్ మీడియాకు చూపించాడు. హోంమంత్రి మనవడి నుంచి తమను కాపాడాలని కోరాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.