Begin typing your search above and press return to search.

కిడ్నాప్ చేసి 16 ఏళ్ల అమ్మాయిపై 4 రోజులుగా 7 మంది గ్యాంగ్ రేప్..!

By:  Tupaki Desk   |   18 July 2020 3:00 PM GMT
కిడ్నాప్ చేసి 16 ఏళ్ల అమ్మాయిపై 4 రోజులుగా 7 మంది గ్యాంగ్ రేప్..!
X
ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 7 మంది వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల పాటు మైనర్ బాలికకు నరకం చూపించి చివరికి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్లిపోయారు.

ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే ..రాజమండ్రి లో ఓ చెప్పుల దుకాణంలో సేల్స్ గర్ల్‌ గా పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై కన్నేసిన కొందరు కామాంధులు..ఆ బాలికపై నిఘా పెట్టి ,బలవంతంగా తీసుకెళ్లి ఓ గదిలో బంధించి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఒక్కొక్కరు పశువుల్లా ఆ అమ్మాయి మీద పడి పశు వాంఛ తీర్చుకున్నారు. ఆలా నాలుగు రోజులు ఆ అమ్మాయికి నరకం చూపించిన తరువాత కారులో తీసుకొచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం.

ఇకపోతే , అమ్మాయి కనబడుట లేదు అని ఆమె తల్లిదండ్రులు ఐదు రోజుల కిందట కోరుకొండ పోలీస్ స్టేషన్ ‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసినప్పటికీ , పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆ కామాంధులు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆ అమ్మాయిని దించేసి వెళ్లిపోవడంతో ఇందులో పోలిసుల పాత్ర కూడా ఉందని స్థానికులు పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలని దిశ పోలీస్ స్టేషన్స్ ..దిశా చట్టం తెచ్చినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.